AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా భయంతో నో ఎంట్రీ.. ఆ షిప్‌లో 2 వేల మంది..!

చైనాలో ప్రాణం పోసుకొని 73దేశాలను గడగడలాడిస్తోంది కరోనావైరస్. చైనాతో పాటు ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియాలో మరణమృదంగం మోగిస్తోంది. కోవిద్ 19 భయంతో దాదాపు 2,000 మందితో కూడిన విహార నౌకను తమ తీరంలోకి

కరోనా భయంతో నో ఎంట్రీ.. ఆ షిప్‌లో 2 వేల మంది..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 08, 2020 | 4:03 PM

Share

చైనాలో ప్రాణం పోసుకొని 73దేశాలను గడగడలాడిస్తోంది కరోనావైరస్. చైనాతో పాటు ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియాలో మరణమృదంగం మోగిస్తోంది. కోవిద్ 19 భయంతో దాదాపు 2,000 మందితో కూడిన విహార నౌకను తమ తీరంలోకి రాకుండా థాయలాండ్, మలేసియా అడ్డుకున్నట్టు అధికారులు వెల్లడించారు. థాయ్‌లాండ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం ఫుకెట్ దీవి నుంచి కోస్టా ఫార్చ్యూనా నౌక శుక్రవారం తిప్పి పంపారు. కరోనా వైరస్ బాధితులు లేకపోయినా నౌకను అక్కడ నుంచి వెనక్కుపంపినట్టు ఆపరేటర్ తెలిపారు. ఈ నౌకలో 64 మంది భారతీయులతో సహా 2,000 మంది ప్రస్తుతం ఈ నౌకలో ఉన్నారు.

ఈ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనావైరస్ మరణాలు చైనా తర్వాత ఇరాన్, ఇటలీలోనే ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఆ దేశ పౌరులను అనుమతించడానికి థాయ్‌లాండ్ అధికారులు నిరాకరించారని కోస్టా నౌక ఆపరేటర్ ట్విట్టర్‌లో తెలిపారు. ఫుకెట్ దీవి నుంచి శుక్రవారం వెనక్కు వచ్చిన కోస్టా ఫార్చ్యూన్.. శనివారం ఉత్తర మలేసియాలోని పెనాంగ్ నౌకాశ్రయంవైపు వస్తుండగా అధికారులు నౌకను రానివ్వకుండా అడ్డుకున్నాయని స్థానిక రాజకీయ నేత ఒకరు వ్యాఖ్యానించారు. తమ తీర ప్రాంతంల్లోని రేవుల్లోకి ప్రయాణికులతో వచ్చే నౌకల ప్రవేశాన్ని మలేసియా నిషేధించిందని ఆయన తెలిపారు.

మరోవైపు, మలేసియా అధికారులు నౌక ప్రవేశాన్ని అడ్డుకోవడంతో పక్క దేశం సింగపూర్‌వైపు వెళ్లిందని అన్నారు. వెస్టర్‌డామ్ నౌక విషయంలోనూ ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. రెండు వారాలపాటు సముద్రంలో ప్రయాణించిన ఈ నౌకను ఐదు దేశాలు తమ తీరంలోకి రాకుండా అడ్డుకోవడంతో చివరకు కాంబోడియా ప్రభుత్వం సౌహార్ద్ర హృదయంతో ఆ నౌకకు ఆశ్రయం ఇచ్చింది. చైనాలోని హుబే ప్రావిన్సుల్లో తొలిసారి వెలుగుచూసిన ప్రాణాంతక కరోనా వైరస్.. ప్రస్తుతం 95 దేశాలకు వ్యాపించింది.