కరోనా కొత్త జన్యువు గుర్తించిన మలేసియా : పది రేట్లు వేగంగా వైరస్ వ్యాప్తి
కరోనా వైరస్కు చెందిన కొత్తరకం జన్యువును మలేసియా సైంటిస్టులు గుర్తించారు. ఇది ప్రజంట్ వైరస్ కంటే పది రెట్లు వేగంగా వ్యాపించగలదని చెప్పారు.
కరోనా వైరస్కు చెందిన కొత్తరకం జన్యువును మలేసియా సైంటిస్టులు గుర్తించారు. ఇది ప్రజంట్ వైరస్ కంటే పది రెట్లు వేగంగా వ్యాపించగలదని చెప్పారు. ఒక క్లస్టర్లోని 45 కేసులలో కనీసం మూడు కేసులలో D614Gగా పిలిచే కరోనా వైరస్ జన్యు ఉత్పరివర్తనం గుర్తించారు. దీన్ని చాలా దేశాల్లో గతంలోనే ఐడెండిఫై చేసినట్టు చెప్పారు. ఫిలిప్పీన్స్ నుంచి తిరిగొచ్చిన వ్యక్తులు ఉన్న మరో క్లస్టర్లో కూడా ఈ జాతిని గుర్తించినట్టు సైంటిస్టులు వివరించారు. కాగా ఇండియా నుంచి తిరిగొచ్చిన రెస్టారెంట్ ఓనర్ 14 రోజుల హోం క్వారంటైన్ రూల్స్ ఉల్లంఘించడంతో అతడికి ఐదు నెలల జైలు శిక్ష విధించడంతో పాటు ఫైన్ వేశారు.
కొత్త మ్యుటేషన్ కరోనావైరస్ వ్యాప్తిని వేగవంతం చేస్తుందని టాప్ ఇమ్యునోలజిస్ట్ డాక్టర్ ఆంథోనీ ఫౌసీ చెప్పారు.ఇప్పటికే వ్యాక్సిన్లపై కొనసాగుతున్న ప్రయోగాలు ఈ మ్యుటేషన్ను ఎదుర్కునేందుకు అనుగుణంగా ఉండకపోవచ్చని మలేసియా ఆరోగ్య విభాగం డైరెక్టర్ జనరల్ నూర్ హిషామ్ అబ్దుల్లా తెలిపారు.
ఈ మ్యుటేషన్ అమెరికా, ఐరోపాలో విభిన్నంగా ఉందని, ఈ జాతి మరింత తీవ్రమైన వ్యాధికి దారితీస్తుందని ఎటువంటి ఆధారాలు లేవని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేర్కొంది. ప్రస్తుతం డెవలప్ చెందుతున్న వ్యాక్సిన్ల సామర్థ్యంపై మ్యుటేషన్ పెద్దగా ఎఫెక్ట్ చూపే అవకాశం లేదని సెల్ ప్రెస్ జర్నల్లో ప్రచురించిన పరిశోధన ఫలితాలు ద్వారా తెలుస్తోంది.
Also Read :