Breaking: ‘దృశ్యం’ దర్శకుడు నిషికాంత్ కామత్ మృతి..
బాలీవుడ్లో దృశ్యం, ఫోర్స్ వంటి సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు నిషికాంత్ కామత్ తుది శ్వాస విడిచారు.
Nishikanth Kamat Passes Away: బాలీవుడ్లో దృశ్యం, ఫోర్స్ వంటి సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు నిషికాంత్ కామత్ తుది శ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా ఆయన కాలేయ సిరోసిస్ అనే వ్యాధితో బాధపడుతుండగా.. జూలై 31వ తేదీన చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతున్న ఆయన.. ఇవాళ కన్నుమూశారు. నిషికాంత్ కామత్ సాయంత్రం 4.24 నిమిషాలకు మరణించినట్లు ఆసుపత్రి సిబ్బంది స్వయంగా ధృవీకరించారు. నిషికాంత్ కామత్ పలు హిందీ, మరాఠీ సినిమాలకు దర్శకుడిగా, రచయితగా పని చేశారు. అజయ్ దేవగణ్ హీరోగా వచ్చిన ‘దృశ్యం’ సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అటు కొన్ని సినిమాల్లో నిషికాంత్ స్వయంగా కూడా నటించారు. కాగా, రాకీ హ్యాండ్సమ్, జూలీ 2, మాదారీ, ముంబై మేరీ జాన్, డొంబివాలి ఫాస్ట్ లాంటి చిత్రాలు నిషికాంత్కు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
Also Read:
కరోనాపై షాకింగ్ న్యూస్.. వైరస్ ఒకటి కాదు.. 73 రకాలు.!
తెలంగాణ: కరోనా బాధితులకు ప్రత్యేక ఎగ్జామ్ సెంటర్లు.. చివరి రోజు ఎంసెట్.!
‘కుట్రదారులకు శిక్ష తప్పదు’: హీరో రామ్
ఇకపై గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేయాలంటే.. అది తప్పనిసరి.!
ధోని అభిమానులకు మరో బ్యాడ్ న్యూస్…
‘రనౌట్’తో కెరీర్ ప్రారంభం.. అదే రిటైర్మెంట్కు కారణం..!
వరుసగా నాలుగు వికెట్లు.. చరిత్ర సృష్టించిన మహిళా క్రికెటర్..
భారత యువత టార్గెట్గా చైనా కుట్ర.. చేధించిన హైదరాబాద్ పోలీసులు..