వరుసగా నాలుగు వికెట్లు.. చరిత్ర సృష్టించిన మహిళా క్రికెటర్..
భారత సంతతి మహిళా క్రికెట్ అంతర్జాతీయ టీ20లో అద్భుతమైన రికార్డును నెలకొల్పింది. జర్మనీ విమెన్స్ టీమ్ కెప్టెన్ అనురాధ దొడ్డబళ్ళాపూర్ శుక్రవారం ఆస్ట్రియాతో జరిగిన..
Anuradha Doddaballapur Creates History: భారత సంతతి మహిళా క్రికెట్ అంతర్జాతీయ టీ20లో అద్భుతమైన రికార్డును నెలకొల్పింది. జర్మనీ విమెన్స్ టీమ్ కెప్టెన్ అనురాధ దొడ్డబళ్ళాపూర్ శుక్రవారం ఆస్ట్రియాతో జరిగిన టీ20 మ్యాచ్లో వరుసగా నాలుగు బంతుల్లో 4 వికెట్లు తీసి చరిత్ర సృష్టించింది. దీనితో అనురాధ ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్ గా చరిత్ర సృష్టించింది.
199 పరుగుల భారీ లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన ఆస్ట్రియాను 33 ఏళ్ల అనురాధ బెంబేలేత్తించింది. తన అద్భుతమైన బౌలింగ్తో ఆస్ట్రియాను తక్కువ స్కోర్కే కట్టడి చేసింది. ఈ మ్యాచ్లో అనురాధ కేవలం ఒక్క పరుగు మాత్రమే సమర్పించుకుని ఓవరాల్గా ఐదు వికెట్లు పడగొట్టింది. లక్ష్య చేధనలో ఆస్ట్రియా 20 ఓవర్లలో 61/9 స్కోర్ చేయగలిగింది. దానితో జర్మనీ 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Also Read:
ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ రోజే ‘జగనన్న విద్యా కానుక’..