AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Heatwave Alert: ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం.. పూర్తి వివరాలు

Andhra Pradesh Weather Update: ఏపీలోని పలు ప్రాంతాల్లో గురు, శుక్రవారం నాడు తీవ్ర వడగాల్పులు, కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశముంది. ఆ మేరకు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. దీని మేరకు మే రెండో తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని 31 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 234 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. 

AP Heatwave Alert: ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం.. పూర్తి వివరాలు
AP Heatwave Alert
Janardhan Veluru
|

Updated on: May 01, 2024 | 6:53 PM

Share

ఏపీలోని పలు ప్రాంతాల్లో గురు, శుక్రవారం నాడు తీవ్ర వడగాల్పులు, కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశముంది. ఆ మేరకు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. దీని మేరకు మే రెండో తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని 31 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 234 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.  ఎల్లుండి 30 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 121 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

మే 2న తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు (31):-

శ్రీకాకుళం 5 , విజయనగరం 15, పార్వతీపురంమన్యం 8, ప్రకాశం 2, అల్లూరిసీతారామరాజు ఒక మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉంది.

మే 2న వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు (234):-

శ్రీకాకుళం15 , విజయనగరం 10, పార్వతీపురంమన్యం 7, అల్లూరిసీతారామరాజు 9, విశాఖపట్నం1, అనకాపల్లి 15, కాకినాడ 13, కోనసీమ 9, తూర్పుగోదావరి 17, పశ్చిమగోదావరి 1, ఏలూరు 18, కృష్ణా 11, ఎన్టీఆర్ 11, గుంటూరు 16, పల్నాడు 21, బాపట్ల 11, ప్రకాశం 18, తిరుపతి 12, నెల్లూరు 16, అనంతపురం 1, వైయస్సార్ 5 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.

వడగాల్పులు వీచే మండలాల పూర్తి వివరాలు క్రింది లింక్లో

https://apsdma.ap.gov.in/files/73c916f7d71486098e218ab261bc79ad.pdf

బుధవారం పల్నాడు జిల్లా కొప్పునూరులో 46.2°C, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 46°C, ఎన్టీఆర్ జిల్లా చిలకల్లులో 45.8°C, నంద్యాల జిల్లా బనగానపల్లె, నెల్లూరు జిల్లా మర్రిపాడులో 45.7°C, చిత్తూరు జిల్లా కొత్తపల్లిలో 45.6°C, ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 45.5°C, వైయస్సార్ జిల్లా సింహాద్రిపురంలో 44.9°C, బాపట్ల జిల్లా వల్లపల్లిలో 44.6°C, అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో 44.5°C, కర్నూలు జిల్లా పంచలింగాలలో 44°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. 21 జిల్లాల్లో 43°C కు పైగా ఉష్ణోగ్రతలు నమోదైందన్నారు. అలాగే 79 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 118 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు.

ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలి. ఎండదెబ్బ తగలకుండా టోపీ,గొడుగు,టవల్,కాటన్ దుస్తులు ఉపయోగించాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.