కొత్త బిల్డింగ్ ను క్వారంటైన్ కు ఇచ్చిన ముంబై బిల్డర్
కొత్తగా కరోనా సోకుతున్న వారిని క్వారంటైన్ చేయడానికి ముంబై మున్సిపల్ కార్పోరేషన్ కి తలనొప్పిగా మారుతోంది. అయితే ముంబైకి చెందిన ప్రైవేటు బిల్డర్ మెహుల్ సంఘ్వి.. తాను నిర్మించిన బిల్డింగ్ను గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కు అప్పగించేందుకు సిద్ధమయ్యాడు.

కరోనా కరాళనృత్యానికి మహారాష్ట్ర విలవిలలాడుతోంది. రోజు రోజుకి కొవిడ్ కేసుల సంఖ్య వేలు దాటుతోంది. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో మూడొంతుులు మహారాష్ట్రలోనే వెలుగుచూస్తున్నాయి. అయితే రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో సగానికి పైగా ముంబై సిటీలోనే నమోదవుతున్నాయి. దాదాపు 65 వేలకు పైగా ముంబై వాసులు కరోనా బారినపడ్డారు. కరోనా పేషేంట్లకు చికిత్స అందించేందుకు నగరంలోని ఆస్పత్రులు సరిపోవడంలేదు. బీఎంసీ అన్ని రకాల ఏర్పాట్లు చేసినప్పటికీ ప్రైవేట్ ఆస్పత్రులు కూడా కరోనా బాధితులతో నిండిపోతున్నాయి. కొత్తగా కరోనా సోకుతున్న వారిని క్వారంటైన్ చేయడానికి ముంబై మున్సిపల్ కార్పోరేషన్ కి తలనొప్పిగా మారుతోంది. అయితే ముంబైకి చెందిన ప్రైవేటు బిల్డర్ మెహుల్ సంఘ్వి.. తాను నిర్మించిన బిల్డింగ్ను గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కు అప్పగించేందుకు సిద్ధమయ్యాడు. కొత్తగా కట్టిన 19 అంతస్తుల బిల్డింగ్లోని ఫ్లాట్లను ఇచ్చేందుకు అంగీకరించాడు. అందులో ఉండాలనుకున్న టెనెంట్లతోనూ చర్చించి.. దాన్ని క్వారంటైన్ సెంటర్గా మార్చేందుకు కార్పోరేషన్ అధికారులకు అప్పగించాడు.వెంటనే క్వారంటైన్ కేంద్రంగా వాడుకునేందుకు కావాల్సిన సదుపాయాలు ఉన్నాయని సంఘ్వి వివరించారు.
Maharashtra: A pvt builder hands over a 19-storey newly constructed, ready-to-move-in building to Municipal Corporation of Greater Mumbai. Mehul Sanghvi, builder says, “We decided willingly after discussing with tenants. It’s being used as quarantine centre for #COVID patients.” pic.twitter.com/PVhkR8ltfr
— ANI (@ANI) June 21, 2020




