AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిర్మలకు హరీశ్ లెటర్.. మేటర్ ఏంటంటే ?

కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి  నిర్మలా సీతారామన్‌కు తెలంగాణ ఆర్థిక శాఖా మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. అదీ.. అలాంటిలాంటి లేఖ కాదు.. కీలకాంశాలపై తన లేఖలో నిలదీశారు హరీశ్ రావు. ఘాటైన పదజాలం వాడారు. తెలంగాణపై చిన్న చూపు తగదని పేర్కొన్నారు. ఇంతకీ ఏ మేటర్‌లో నిర్మల సీతారామన్ తెలంగాణను చిన్న చూపు చూస్తున్నారు ? ఎందుకు హరీశ్ రావు ఘాటుగా లేఖ రాశారు ?   రీడ్ దిస్ స్టోరీ.. కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి […]

నిర్మలకు హరీశ్ లెటర్.. మేటర్ ఏంటంటే ?
Rajesh Sharma
| Edited By: |

Updated on: Nov 05, 2019 | 5:27 PM

Share
కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి  నిర్మలా సీతారామన్‌కు తెలంగాణ ఆర్థిక శాఖా మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. అదీ.. అలాంటిలాంటి లేఖ కాదు.. కీలకాంశాలపై తన లేఖలో నిలదీశారు హరీశ్ రావు. ఘాటైన పదజాలం వాడారు. తెలంగాణపై చిన్న చూపు తగదని పేర్కొన్నారు. ఇంతకీ ఏ మేటర్‌లో నిర్మల సీతారామన్ తెలంగాణను చిన్న చూపు చూస్తున్నారు ? ఎందుకు హరీశ్ రావు ఘాటుగా లేఖ రాశారు ?   రీడ్ దిస్ స్టోరీ..
కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో వున్నది ఆర్థిక శాఖ. కేంద్రం డైరెక్టుగా వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రాలకు వాటా వుంటుంది. కేంద్రం నుంచి వచ్చే నిధులపై ఒక అంఛనాతోనే రాష్ట్రాల బడ్జెట్లు రూపొందుతాయి. అందుకే రాష్ట్ర బడ్జెట్‌లో ప్రస్తావించే అంశాల అమలు కేంద్రం వైఖరిపై ఆధారపడి వుంటుంది. అందుకే కేంద్రం ప్రతీ మూడు నెలలకు ఒకసారి రాష్ట్రాలకు నిధులను విడుదల చేస్తూ బ్యాలెన్స్ చేస్తూ వుంటుంది.
ఈక్రమంలో ఒక్కో రాష్ట్రం పట్ల ఒక్కో విధానం కనబరచడం కేంద్రంలో అధికారంలో వున్న పార్టీ వ్యూహంపై కూడా ఆధారపడి వుంటుంది. కాంగ్రెస్ పరిపాలనాకాలంలో కాంగ్రేసేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలపై వివక్ష కనిపించేది. అందుకే స్వర్గీయ ఎన్టీఆర్ కాంగ్రేసేతర ముఖ్యమంత్రులను ఒక్కతాటిపైకి తెచ్చి, కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు అప్పట్లో.
తాజా పరిణామాల్లో కేంద్రంలో బిజెపి సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ఉండగా.. తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం వుంది. పన్నుల విధానంలో వచ్చిన మార్పుల ఫలితంగా ఇప్పుడు జీఎస్టీ వసూళ్ళు అత్యంత కీలకమయ్యాయి. జీఎస్టీ పేరుతో కేంద్ర, రాష్ట్రాలకు భారీగా ఆదాయం పెరిగింది. అయితే.. కేంద్రం వసూలు చేసే జీఎస్టీలో రాష్ట్రాల వాటా సకాలంలో విడుదల కావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సరిగ్గా ఇదే అంశంపై హరీశ్ రావు.. కేంద్ర మంత్రి  నిర్మలకు లేఖ  రాశారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన 2 వేల 861 కోట్ల రూపాయల నిధులను వెంటనే రిలీజ్ చేయాలని, జాప్యం తగదని హరీశ్ రావు తన లేఖలో కేంద్ర మంత్రిని కోరారు. అయితే.. తెలంగాణ రాష్ట్రం ఇబ్బందులను తెలియచేసేందుకు హరీశ్ తన లేఖలో కాస్త ఘాటైన పదజాలం వాడడం ఆయన ఆవేదనను తెలియజేస్తోందని అంటున్నారు.