AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేడే జేఈఈ మెయిన్‌ పరీక్ష : నిబంధ‌న‌లు ఇవే

మంగ‌ళ‌వారం జ‌ర‌గ‌నున్న‌ జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వ‌హించ‌డానికి దేశ‌వ్యాప్తంగా 3843 ఎగ్జామ్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్షా కేంద్రాల సంఖ్య‌ను 570 నుంచి 660కి పెంచారు.

నేడే జేఈఈ మెయిన్‌ పరీక్ష : నిబంధ‌న‌లు ఇవే
Ram Naramaneni
|

Updated on: Sep 01, 2020 | 7:45 AM

Share

మంగ‌ళ‌వారం జ‌ర‌గ‌నున్న‌ జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వ‌హించ‌డానికి దేశ‌వ్యాప్తంగా 3843 ఎగ్జామ్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్షా కేంద్రాల సంఖ్య‌ను 570 నుంచి 660కి పెంచారు. ఎగ్జామ్ హాల్‌లో భౌతిక దూరం పాటించ‌డం కోసం ఎగ్జామ్ సెంట‌ర్ల‌ను గణనీయంగా పెంచారు. మెయిన్‌ పరీక్ష కోసం దేశవ్యాప్తంగా 8.58 లక్షల మంది అభ్యర్థులు రిజిస్టర్‌ చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుండి లక్షా 40వేల మంది విద్యార్థులు ప‌రీక్ష‌రాయ‌నున్నారు. రెండు సెషన్లలో జేఈఈ మెయిన్స్ పరీక్ష జ‌ర‌గ‌నుంది

మొదటి సెషన్ ఉదయం 9 గంటలనుండి 12 గంటల వరకు, రెండవ స్టేషన్ మధ్యాహ్నం మూడు గంటల నుండి 6 గంటల వరకు ఉంటుంది. జెఇఇ మెయిన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సిబిటి ) అన్న విష‌యం తెలిసిందే. అభ్యర్థులు సామాజిక దూరం పాటించేలా పరీక్షా కేంద్రాల వద్ద తగిన ఏర్పాట్లు చేశారు. క‌రోనా సింట‌మ్స్ ఉన్న‌ విద్యార్థుల కోసం ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. వీటిల్లోని ఇన్విజిలేట‌ర్ల‌కు పీపీఈ కిట్లు ఇవ్వనున్నారు. స్టూడెంట్స్ పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించే ముందు అందరికీ థర్మల్ ‌స్క్రీనింగ్‌ నిర్వహిస్తారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు తీసుకెళ్లాల్సిన వాటి వివరాలు జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) వెల్లడించింది.

  • ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసిన అడ్మిట్‌ కార్డులో.. క‌రోనా సింట‌మ్స్‌కు సంబంధించి సెల్ఫ్ డిక్ల‌రేష‌న్‌తో వివరాలు నమోదు చేసి వెంట తీసుకువెళ్లాలి. గత 14 రోజులుగా జ్వరం, దగ్గు, గొంతు, శ్వాస సమస్యలు లేవని తెలపాలి. దానిపై ఫొటో అంటించి, సంతకంతోపాటు ఎడమ చేతి బొటనవేలి ముద్ర వేయాలి.
  • హాజరు షీటుపై అతికించేందుకు అదనంగా ఫొటో తీసుకెళ్లాలి
  • డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, ఇంటర్‌ రెండో ఏడాది రిజిస్ట్రేషన్‌ కార్డు, ఆధార్‌, పాస్‌పోర్టు తదితర గ‌వ‌ర్న‌మెంట్‌ జారీ చేసిన గుర్తింపు కార్డు చూపించాలి
  • వ్యక్తిగత శానిటైజర్‌(50ఎంఎల్‌), పారదర్శకంగా ఉండే నీటి సీసాను ఎగ్జామ్ సెంట‌ర్లోకి అనుమతిస్తారు.

Also Read : ఆరు వారాల్లో ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ !