AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అవినీతిపై జగన్మోహనాస్త్రం..రంగంలోకి అహ్మదాబాద్ బ్యాచ్!

అధికారపగ్గాలు చేపట్టినప్పట్నించి అవినీతిరహిత పాలన అందిస్తానంటూ చెబుతూ వస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్లుగానే పక్కా చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాజకీయ అవినీతిని పూర్తి అరికట్టగలిగామని చెప్పుకున్న ముఖ్యమంత్రి, అధికార యంత్రాంగంలోని అవినీతిని అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. అవినీతి లూప్‌హోల్స్‌ని కనుగునేందుకు జగన్ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రభుత్వాధికారులను షాక్‌కు గురిచేస్తోంది. అహ్మదాబాద్‌లోని ఐఐఎంను రంగంలోకి దింపాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పథకాల అమలుపై ప్రభావం చూపుతూ, […]

అవినీతిపై జగన్మోహనాస్త్రం..రంగంలోకి అహ్మదాబాద్ బ్యాచ్!
Rajesh Sharma
| Edited By: Nikhil|

Updated on: Nov 22, 2019 | 4:14 PM

Share

అధికారపగ్గాలు చేపట్టినప్పట్నించి అవినీతిరహిత పాలన అందిస్తానంటూ చెబుతూ వస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్లుగానే పక్కా చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాజకీయ అవినీతిని పూర్తి అరికట్టగలిగామని చెప్పుకున్న ముఖ్యమంత్రి, అధికార యంత్రాంగంలోని అవినీతిని అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. అవినీతి లూప్‌హోల్స్‌ని కనుగునేందుకు జగన్ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రభుత్వాధికారులను షాక్‌కు గురిచేస్తోంది.

అహ్మదాబాద్‌లోని ఐఐఎంను రంగంలోకి దింపాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పథకాల అమలుపై ప్రభావం చూపుతూ, ప్రభుత్వ లక్ష్యాలను నీరుగారుస్తున్న అవినీతిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించాలని ఐఐఎం(అహ్మదాబాద్)తో ఒప్పందం కుదుర్చుకుంది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు రూపొందించిన ఒప్పందంపై ఏపీ ఏసీబీ డైరెక్టర్ జనరల్ విశ్వజిత్, అహ్మదాబాద్ ఐఐఎం చీఫ్ ప్రొఫెసర్ డా.సుందరవల్లి నారాయణ స్వామి సంతకాలు చేశారు. ఈ ఒప్పందం మేరకు ఏపీలో ప్రభుత్వ పథకాలను, వాటి అమలు తీరుతెన్నులను ఐఐఎం టీమ్ కూలంకషంగా మూడు నెలల పాటు అధ్యయనం చేసి, అవినీతిరహితంగా పథకాలను అమలు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తుంది.

గ్రామస్థాయిలో ఏర్పాటైన సచివాలయాలు, వార్డు సచివాలయాల కారణంగా ప్రభుత్వ పథకాలు గ్రౌండ్ లెవెల్‌లో లబ్దిదారులకు చేరాయని, అయితే కింది స్థాయి అవినీతిని పూర్తిగా అరికడితేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని తాము భావిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ అంటున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా చాలా మటుకు సమస్యలను పరిష్కరించుకోగలుగుతున్నామని జగన్ చెబుతున్నారు. అయితే.. ఇందులో అధికారుల వివక్ష ఎక్కడ చోటుచేసుకుంటుందన్న అంశంపై అధ్యయనం చేయాల్సిందిగా ఐఐఎం ప్రొఫెసర్లను కోరారు ముఖ్యమంత్రి. తాజా ఒప్పందంలో భాగంగా గ్రామ, మండల, డివిజనల్ స్థాయిల్లో రెవెన్యూ, పరిషత్ కార్యాలయాల్లో పరిశీలన కోసం మెకానిజం ఐఐఎం ఏర్పాటు చేయనుంది. ఆ తర్వాత ఏ స్థాయిలోను అధికారులు లంచం కోసం అర్రులు చాచలేని పరిస్థితిని కల్పించేందుకు అవసరమైన చర్యలను ఐఐఎం ఏపీ ప్రభుత్వానికి అందించనుంది.