ఫార్మారంగ దిగ్గజం దివీస్‌‌‌‌‌ ల్యాబోరేటరీస్‌పై ఐటీ దాడులు

TV9 Telugu Digital Desk

TV9 Telugu Digital Desk | Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:13 PM

హైదరాబాద్: ప్రముఖ ఫార్మారంగ దిగ్గజం దివీస్ ల్యాబోరేటరీస్‌పై ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సంస్థ పది కార్యాలయాలపై ఏక కాలంలో సోదాలు చేపట్టారు. గురువారం ఉదయం 8గంటల నుంచి ఈ దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులను కార్యాలయాల నుంచి వెళ్లకుండా అధికారులు అడ్డుకున్నారు. అల్పాహారం, మధ్యాహ్న భోజనం కూడా బయటి నుంచి కార్యాలయానికి తెప్పించుకోవాలని ఐటీ అధికారులు సూచించారు. మరోవైపు ఈ దాడులపై దివీస్ యాజమాన్యం స్పందించింది. ఐటీ అధికారులు […]

ఫార్మారంగ దిగ్గజం దివీస్‌‌‌‌‌ ల్యాబోరేటరీస్‌పై ఐటీ దాడులు

హైదరాబాద్: ప్రముఖ ఫార్మారంగ దిగ్గజం దివీస్ ల్యాబోరేటరీస్‌పై ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సంస్థ పది కార్యాలయాలపై ఏక కాలంలో సోదాలు చేపట్టారు. గురువారం ఉదయం 8గంటల నుంచి ఈ దాడులు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఉద్యోగులను కార్యాలయాల నుంచి వెళ్లకుండా అధికారులు అడ్డుకున్నారు. అల్పాహారం, మధ్యాహ్న భోజనం కూడా బయటి నుంచి కార్యాలయానికి తెప్పించుకోవాలని ఐటీ అధికారులు సూచించారు. మరోవైపు ఈ దాడులపై దివీస్ యాజమాన్యం స్పందించింది. ఐటీ అధికారులు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలకు పూర్తి వివరాలు సమర్పిస్తామని సంస్థ అధికారులు చెప్పారు. తమ కంపెనీ నిబద్ధతతో పన్నులు చెల్లించి.. ఏటా ఐటీ అధికారులకు వివరాలు సమర్పిస్తుందని వారు అన్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu