AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంచు పర్వతాన్ని అధిరోహించిన ఐపీఎస్ మనవాడే..!

అత్యంత ప్రాధాన్యత కలిగిన వృత్తిలో ఉంటూ కర్స్‌టెన్జ్ మంచు పర్వతాన్ని అధిరోహించారు ఐపీఎస్ తరుణ్ జోషి. ఎంబీబీఎస్, హౌస్ సర్జన్ కూడా చేశారు. తరువాత ఐపీఎస్ చేసి పోలీసుగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో రాచకొండ సంయుక్త కమిషనర్, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌ డీసీపీగా, ఆదిలాబాద్ ఎస్పీగా, ఎల్బీనగర్ డీసీపీగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ప్రత్యేక విభాగం సంయుక్త కమిషనర్‌గా పనిచేస్తున్నారు. పర్వతారోహణ అంటే ఆయనకు ఎంతో ఇష్టం. గతంలో ఆరేళ్ల క్రితం ఉత్తరాఖండ్ […]

మంచు పర్వతాన్ని అధిరోహించిన ఐపీఎస్ మనవాడే..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 17, 2019 | 10:48 AM

Share

అత్యంత ప్రాధాన్యత కలిగిన వృత్తిలో ఉంటూ కర్స్‌టెన్జ్ మంచు పర్వతాన్ని అధిరోహించారు ఐపీఎస్ తరుణ్ జోషి. ఎంబీబీఎస్, హౌస్ సర్జన్ కూడా చేశారు. తరువాత ఐపీఎస్ చేసి పోలీసుగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో రాచకొండ సంయుక్త కమిషనర్, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌ డీసీపీగా, ఆదిలాబాద్ ఎస్పీగా, ఎల్బీనగర్ డీసీపీగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ప్రత్యేక విభాగం సంయుక్త కమిషనర్‌గా పనిచేస్తున్నారు. పర్వతారోహణ అంటే ఆయనకు ఎంతో ఇష్టం. గతంలో ఆరేళ్ల క్రితం ఉత్తరాఖండ్ లో సంభవించిన వరదల్లో తెలుగువారిని రక్షించేందుకు బృందానికి తరుణ్ జోషి ఆధ్వర్యంలోనే ఒక బృందం అక్కడికి వెళ్లింది. అలాగే బద్రీనాథ్ వరదల్లో చిక్కుకున్న ఎంతోమంది తెలుగువారిని కూడా ఆయన రక్షించారు. ఇండోనేషియాలోని పవువామా ద్వీపంలో ఉన్న ఎత్తైన మంచు పర్వతాల్లో ఒకటైన కార్స్‌టెన్జ్‌‌ను తరుణ్ జోషి అధిరోహించారు. 4,884 మీటర్ల ఎత్తున్న ఈ పర్వత శిఖరాన్ని ఆగష్టు 15న తెల్లవారుజామున 1.15 నిమిషాలకు ఆయన చేరుకున్నారు. మంచు, రాళ్లతో కూడిన ఈ పర్వతాన్ని ఎక్కిన రెండో భారతీయుడిగా తరుణ్‌జోషి ఘనతను సాధించారు.