కార్పోరేట్ కాలేజీల‌కు ఇంట‌ర్ బోర్డు భారీ షాక్….నోటీసులు జారీ

1, 1, 1.. 2, 2, 2 అంటూ టీవీల్లో మోగే మోత అంద‌రికీ తెలిసిందే. ఏవైనా ప‌రీక్ష‌లు ఫ‌లితాలు వ‌స్తే చాలు టీవీ వీక్షకుల‌కు ఈ టార్చ‌ర్ త‌ప్ప‌దు. అస‌లు ప‌లు కాలేజీల‌కు ఒకే విభాగంలో ఫ‌స్ట్ ర్యాంక్ ఎలా వ‌స్తుందో తెలియ‌దు.

కార్పోరేట్ కాలేజీల‌కు ఇంట‌ర్ బోర్డు భారీ షాక్....నోటీసులు జారీ
Follow us

|

Updated on: Jun 27, 2020 | 8:06 PM

1, 1, 1.. 2, 2, 2 అంటూ టీవీల్లో మోగే మోత అంద‌రికీ తెలిసిందే. ఏవైనా ప‌రీక్ష‌లు ఫ‌లితాలు వ‌స్తే చాలు టీవీ వీక్షకుల‌కు ఈ టార్చ‌ర్ త‌ప్ప‌దు. అస‌లు ప‌లు కాలేజీల‌కు ఒకే విభాగంలో ఫ‌స్ట్ ర్యాంక్ ఎలా వ‌స్తుందో తెలియ‌దు. విద్యార్థులను త‌మ కాలేజీల వైపు ఆకర్షించాల‌ని కొన్ని సంస్థ‌లు ప‌న్నే వ్యూహం ఇది. అయితే ఇది ఇంట‌ర్ బోర్డు చ‌ర్య‌ల‌కు పూర్తి విరుద్దం. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల రిలీజ్ చేసిన‌ ఇంటర్మీడియట్‌ ఫలితాలను టీవీలు, పత్రికల్లో ప్రచారం చేస్తున్న క‌ళాశాల‌ల‌కు నోటీసులు జారీ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ ఆదేశించారు.

ఇంటర్ రిజ‌ల్ట్స్ తర్వాత పలు క‌ళాశాల‌ల‌ యాజమాన్యాలు.. ర్యాంకులను, మార్కులను టీవీలు, పత్రికల్లో ప్రచారం చేస్తూ అడ్మిష‌న్స్ కోసం స్టూడెంట్స్ ను ఆకర్షిస్తున్నాయన్నారు. తమ క‌ళాశాల‌ విద్యార్థులే రాష్ట్ర, జిల్లా, నియోజ‌క‌వ‌ర్గ‌, పట్టణ, మండల స్థాయి టాపర్లుగా, ర్యాంకర్లుగా పేర్కొంటూ విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నం చేసినట్లు తమకు స‌మాచారం అందింద‌ని, ఇదీ బోర్డు రూల్సుకు పూర్తి విరుద్ధమని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇలాంటి ప్రయత్నాలు చేసిన క‌ళాశాల‌ల‌కు వెంటనే షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. రూల్స్ అతిక్రమించే వారికి కనీసం మూడేళ్లు, గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల నుంచి రూ.లక్ష వరకు ఫైన్ విధించవచ్చని పేర్కొన్నారు.