AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలో కాస్త తగ్గిన కరోనా తీవ్రత.. కొత్తగా ఎన్ని కేసులంటే.!

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 70,589 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 776 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 61,45,291కి చేరుకుంది. ఇందులో 9,47,576 యాక్టివ్ కేసులు ఉండగా.. 96,318 మంది కరోనాతో మరణించారు. అటు 51,01,398 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. (Coronavirus Positive […]

దేశంలో కాస్త తగ్గిన కరోనా తీవ్రత.. కొత్తగా ఎన్ని కేసులంటే.!
Ravi Kiran
|

Updated on: Sep 29, 2020 | 9:45 AM

Share

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 70,589 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 776 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 61,45,291కి చేరుకుంది. ఇందులో 9,47,576 యాక్టివ్ కేసులు ఉండగా.. 96,318 మంది కరోనాతో మరణించారు. అటు 51,01,398 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. (Coronavirus Positive Cases India)

ఇదిలా ఉంటే అన్ని రాష్ట్రాల్లోనూ రికవరీ శాతం పెరుగుతూ ఉంది. నిన్న ఒక్క రోజు దేశవ్యాప్తంగా 84,877 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. అత్యధిక పాజిటివ్ కేసుల లిస్టులో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. మహారాష్ట్రలో నిన్న ఒక్క రోజులో 11,921 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అక్కడ మొత్తం సంఖ్య 13,51,153కి చేరింది. కాగా, దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల రేట్ 15.42 శాతం, రికవరీ రేట్ 83.01 శాతంగా.. డెత్ రేట్ 1.57 శాతంగా ఉంది.

Also Read:

నాలుగేళ్ల డిగ్రీ చేసినవారికి పీహెచ్‌డీ అడ్మిషన్లు..

మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలు.!

ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ.. ఆ ప్రదేశాల్లో లిక్కర్ షాపులకు నో పర్మిషన్..

బ్రూసెల్లోసిస్‌… తస్మాత్ జాగ్రత్త.!

రైల్వే ప్రయాణీకులకు బ్యాడ్ న్యూస్.. రూ. 35 వరకు పెరగనున్న టికెట్ ధర!