ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ.. ఆ ప్రదేశాల్లో లిక్కర్ షాపులకు నో పర్మిషన్..
ఆంధ్రప్రదేశ్లో కొత్త ఎక్సైజ్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పాలసీ అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్లో కొత్త ఎక్సైజ్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పాలసీ అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 2934 మద్యం దుకాణాలను మరో ఏడాది పాటు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మద్యం దుకాణాల తగ్గింపు అంశాన్ని కొత్త పాలసీలో ప్రస్తావించలేదు. అలాగే ప్రతీ ఏడాది 20 శాతం మేర మద్యం దుకాణాలను తగ్గించాలని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. (New Excise Policy)
ఇదిలా ఉంటే లాక్ డౌన్ తర్వాత 13 శాతం మద్యం దుకాణాలను తగ్గించడం వల్ల.. ప్రస్తుత పాలసీలో తగ్గింపు ప్రస్తావనను తీసుకురాలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అటు ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలోని పలు ప్రదేశాల్లో లిక్కర్ షాపులు, లిక్కర్ అమ్మకాలపై నిషేధం విధించింది.
తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి అలిపిరికి వెళ్లే మార్గంలో లిక్కర్ షాపులకు పర్మిషన్ ఇవ్వని ప్రభుత్వం.. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్, లీలా మహల్ సెంటర్, నంది సర్కిల్, విష్ణు నివాసం, శ్రీనివాసం వంటి ప్రాంతాల్లో లిక్కర్ అమ్మకాలపై నిషేధం విధించింది. అలాగే ఎక్సైజ్ కమిషనర్ అనుమతితో లిక్కర్ మాల్స్ ఏర్పాటు చేసుకోవచ్చునని ప్రభుత్వం తెలిపింది. కాగా, ప్రభుత్వం నిర్దేశించిన 2934 దుకాణాల పరిధికి లోబడే లిక్కర్ మాల్స్ ఏర్పాటు చేయనున్నారు.
Also Read:
రియాతో చాట్ చేశా.. కానీ డ్రగ్స్ తీసుకోలేదుః రకుల్
విద్యార్ధులకు గుడ్ న్యూస్.. స్కూల్కు వెళ్లకుండానే పది పరీక్షలు.?
ఏపీ ప్రజలకు ఆర్టీసీ అలెర్ట్.. నిలబడి ప్రయాణించడానికి నో ఎంట్రీ..