AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలో ఇప్పటి వరకు కొవిడ్ టెస్ట్ ఎంతమందికి చేశారంటే..

దేశంలో కొవిడ్‌-19 తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కరోనా నిర్ధారణ పరీక్షల పెంచాలని కేంద్రం నిర్ణయించింది.

దేశంలో ఇప్పటి వరకు కొవిడ్ టెస్ట్ ఎంతమందికి చేశారంటే..
Balaraju Goud
|

Updated on: Jun 10, 2020 | 5:18 PM

Share

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా కల్లోలాన్ని సృష్టిస్తోంది. దేశంలోనూ చాపకింద నీరులా మెల్లమెల్లగా విస్తరిస్తోంది. కేంద్రం కరోనా కట్టడికి అనేక చర్యలు చేపడుతోంది. అయినా అంతకంతకూ కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కొవిడ్‌-19 తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కరోనా నిర్ధారణ పరీక్షల పెంచాలని కేంద్రం నిర్ణయించింది. దీనిలో భాగంగా భారత వైద్య పరిశోధన మండలి(ICMR)కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను వేగవంతం చేసింది. ప్రతిరోజు దాదాపు లక్షా 45వేల కొవిడ్‌ నమూనాలకు పరీక్షలు నిర్వహిస్తోంది. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 50,61,332 మంది నుంచి కొవిడ్‌-19 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. ఇక భారత్‌లో కొవిడ్‌-19 నిర్ధారణ కోసం ప్రస్తుతం ఆర్‌టీ-పీసీఆర్‌ పద్దతిని ఐసీఎంఆర్‌ అనుసరిస్తోంది. దీనితోపాటు క్షయవ్యాధి నిర్ధారణకు చేసే ట్రూనాట్‌, సీబీనాట్‌ విధానాన్ని కూడా వినియోగిస్తోంది. దేశంలో ఉన్న 823 ల్యాబ్‌ల ద్వారా కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలను ఐసీఎంఆర్‌ చేపడుతోంది. ఇందుకు కోసం 590 ప్రభుత్వ లాబొరేటరీలను వినియోగిస్తుండగా.. మరో 233 ప్రైవేట్ ల్యాబ్‌ల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా దేశంలోని మొత్తం ల్యాబ్‌లలో దాదాపు 520 ల్యాబ్‌లలో ఆర్‌టీ-పీసీఆర్‌, 240 ల్యాబ్‌లలో ట్రూనాట్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరో 63 కేంద్రాల్లో సీబీనాట్‌ పరీక్షలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా బుధవారం ఉదయానికి మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,76,583కి చేరగా వీరిలో 7,745 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజే 9,985 కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రధాన నగరాల్లో ర్యాండంగా కరోనా పరీక్షలు నిర్వహించాలని ఐసీఎంఆర్‌ అయా రాష్ట్రాలకు సూచించింది,

Follow Us
పంచదార్ల అక్రమ మైనింగ్‌పై పవన్ కల్యాణ్ సీరియస్.. విచారణకు ఆదేశాలు, అనుమతుల రద్దుకు నిర్ణయం
పంచదార్ల అక్రమ మైనింగ్‌పై పవన్ కల్యాణ్ సీరియస్.. విచారణకు ఆదేశాలు, అనుమతుల రద్దుకు నిర్ణయం
ఢిల్లీని టార్గెట్ చేసిందెవరు? నిఘా వర్గాల నివేదిక ఏంటీ..?
ఢిల్లీని టార్గెట్ చేసిందెవరు? నిఘా వర్గాల నివేదిక ఏంటీ..?
అర్ధరాత్రి ఘోరం.. తెల్లారేసరికి ఇంటి ముందు 40 మూగ జీవాలు మృతి..
అర్ధరాత్రి ఘోరం.. తెల్లారేసరికి ఇంటి ముందు 40 మూగ జీవాలు మృతి..
‘జబర్దస్త్’లోకి హైపర్ ఆది రీ ఎంట్రీ.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
‘జబర్దస్త్’లోకి హైపర్ ఆది రీ ఎంట్రీ.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
కాకినాడ సుబ్బయ్యగారి హోటల్ ఫేమస్ 'గోంగూర సోయా కర్రీ'
కాకినాడ సుబ్బయ్యగారి హోటల్ ఫేమస్ 'గోంగూర సోయా కర్రీ'
అప్పటికప్పుడు 5 నిమిషాల్లో చేసుకునే కమ్మటి బెల్లం అట్లు
అప్పటికప్పుడు 5 నిమిషాల్లో చేసుకునే కమ్మటి బెల్లం అట్లు
నీట్ పేపర్ లీక్‌పై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు..!
నీట్ పేపర్ లీక్‌పై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు..!
హోటల్ స్టైల్ కమ్మటి ఇడ్లీ కారప్పొడి..
హోటల్ స్టైల్ కమ్మటి ఇడ్లీ కారప్పొడి..
ఒకే ఇంట్లో నలుగురు పిల్లలకు 'తల్లికి వందనం' డబ్బులు జమ..
ఒకే ఇంట్లో నలుగురు పిల్లలకు 'తల్లికి వందనం' డబ్బులు జమ..
ట్రాన్స్‌కో డీఈ ముత్యం వెంకటరమణ అరెస్ట్‌
ట్రాన్స్‌కో డీఈ ముత్యం వెంకటరమణ అరెస్ట్‌