తెలంగాణలో 50 మంది ఐఏఎస్​ల బదిలీ

తెలంగాణలో సీనియర్ బ్యూరోక్రాట్లు, జిల్లా కలెక్టర్లతో సహా దాదాపు 50 మంది ఐఎఎస్ అధికారులను బదిలీ చేసి ఇతర విభాగాలకు పంపించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం కార్యదర్శి ఆధార్ సిన్హా, హౌసింగ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్ తదితరులను బదిలీ చేసి వివిధ విభాగాలకు పంపించారు. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రజత్ […]

తెలంగాణలో 50 మంది ఐఏఎస్​ల బదిలీ
Follow us

| Edited By: Srinu

Updated on: Feb 03, 2020 | 1:17 PM

తెలంగాణలో సీనియర్ బ్యూరోక్రాట్లు, జిల్లా కలెక్టర్లతో సహా దాదాపు 50 మంది ఐఎఎస్ అధికారులను బదిలీ చేసి ఇతర విభాగాలకు పంపించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం కార్యదర్శి ఆధార్ సిన్హా, హౌసింగ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్ తదితరులను బదిలీ చేసి వివిధ విభాగాలకు పంపించారు.

చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రజత్ కుమార్‌ను బదిలీ చేసి నీటిపారుదల శాఖ కార్యదర్శిగా నియమించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శిగా నియమితులైన బి జనార్దన్ రెడ్డి స్థానంలో చిత్ర రామచంద్రన్‌ను విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు. ముఖ్యమంత్రి కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను బదిలీ చేసి పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శిగా నియమించారు.  పీఆర్ ప్రిన్సిపల్​ సెక్రెటరీగా ఉన్న వికాస్ రాజును బదిలీ చేసి GAD ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు.

ప్రస్తుత GAD కార్యదర్శి ఆధార్ సిన్హాను పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. పెద్దపల్లి, జగిత్యాల, వనపర్తి, వరంగల్ (అర్బన్), కొమరం భీమ్ ఆసిఫాబాద్, జనగాం, జయశంకర్ భూపాల్‌పల్లి సహా అనేక జిల్లాల కలెక్టర్లను కూడా బదిలీ చేసి రాష్ట్రంలోని వివిధ శాఖలకు పంపించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్థాయిలో బదిలీలు జరగడం ఇదే మొదటిసారి.

21 జిల్లాల కలెక్టర్లు బదిలీ :

భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ కామారెడ్డి జిల్లా కలెక్టర్‌గా శరత్‌ వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా పౌసుమి బసు భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా ఎంవీ రెడ్డి ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా శ్రీదేవసేన నారాయణపేట జిల్లా కలెక్టర్‌గా హరిచందన హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా శ్వేత మహంతి నల్గొండ జిల్లా కలెక్టర్‌గా పాటిల్‌ ప్రశాంత్‌ జీవన్‌ వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌గా రాజీవ్‌గాంధీ హన్మంతు జోగులాంబ-గద్వాల జిల్లా కలెక్టర్‌గా శృతి ఓజా సూర్యాపేట జిల్లా కలెక్టర్‌గా టి.వినయ్‌క్రిష్ణారెడ్డి మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌గా వి.వెంకటేశ్వర్లు ఆసిఫాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా సందీప్‌కుమార్‌ పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌గా సిక్తా పట్నాయక్‌ నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌గా ముషరఫ్‌ అలీ ఫరూఖీ ములుగు జిల్లా కలెక్టర్‌గా ఎస్‌.కృష్ణ ఆదిత్య మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా వి.పి.గౌతమ్‌ జగిత్యాల జిల్లా కలెక్టర్‌గా జి.రవి జనగామ జిల్లా కలెక్టర్‌గా కె.నిఖిల వనపర్తి జిల్లా కలెక్టర్‌గా ఎస్‌కే యాస్మీన్‌ బాషా మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌గా ఎస్‌.వెంకటరావు

18 మంది సీనియర్‌ ఐఏఎస్‌లకు స్థానచలనం : విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా చిత్రా రామచంద్రన్‌ చిత్రారామచంద్రన్‌కు గృహనిర్మాణ శాఖ అదనపు బాధ్యతలు పశుసంవర్ధక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా అదర్‌సిన్హా నీటిపారుదల ప్రిన్సిపల్‌ సెక్రటరీగా రజత్‌కుమార్‌ జీఏడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా వికాస్‌ రాజ్‌ రెవెన్యూశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా జగదీశ్వర్‌ ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌గా పార్థసారథి బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి, కమిషనర్‌గా బుర్రా వెంకటేశం వ్యవసాయశాఖ కార్యదర్శి, కమిషనర్‌గా జనార్ధన్‌రెడ్డి పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శిగా సందీప్‌కుమార్‌ సుల్తానియా ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా రాహుల్‌ బొజ్జా గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శిగా క్రిస్టినా ఆర్థికశాఖ కార్యదర్శులుగా టీకే శ్రీదేవి, రోనాల్డ్‌ రోస్‌ పరిశ్రమల కమిషనర్‌గా మాణిక్‌రాజ్‌ భూపరిపాలన శాఖ సంచాలకులుగా రజత్‌కుమార్‌ షైనీ మున్సిపల్‌ శాఖ కమిషనర్‌గా ఎన్‌.సత్యనారాయణ మహిళా శిశుసంక్షేమ శాఖ కార్యదర్శిగా దివ్య సీఎస్‌కు ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌గా అద్వైత్‌కుమార్‌ సింగ్‌