AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఊరేగింపుకు అనుమతిని ఇవ్వలేము…

మొహర్రం ఊరేగింపుకు తాము అనుమతిని ఇవ్వలేమని హైకోర్టు చెప్పింది.  ఈ నెల 30న హైదరాబాదులోని పాతబస్తీ డబీర్ పురా బీబీకా అలావా నుంచి చాదర్ ఘాట్ వరకు మొహర్రం ఊరేగింపుకు అనుమతించేలా పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేయాలని బుధవారం తెలంగాణ..

ఊరేగింపుకు అనుమతిని ఇవ్వలేము...
Sanjay Kasula
|

Updated on: Aug 26, 2020 | 8:31 PM

Share

మొహర్రం ఊరేగింపుకు తాము అనుమతిని ఇవ్వలేమని హైకోర్టు చెప్పింది.  ఈ నెల 30న హైదరాబాదులోని పాతబస్తీ డబీర్ పురా బీబీకా అలావా నుంచి చాదర్ ఘాట్ వరకు మొహర్రం ఊరేగింపుకు అనుమతించేలా పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేయాలని బుధవారం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఊరేగింపుకు తాము అనుమతిని ఇవ్వలేమని తేల్చి చెప్పింది. మొహర్రం ఊరేగింపుకు సంబంధించి  మంగళవారం సుప్రీంకోర్టు ఒక పిటిషన్ ను నిరాకరించిందని… అందువల్ల తాము కూడా పర్మిషన్ ఇవ్వలేదని పేర్కొంది. అదే విధంగా కరోనా వ్యాప్తి క్రమంలో కేంద్ర హోంశాఖ ఆదేశాల ప్రకారం దేశ వ్యాప్తంగా ఊరేగింపులపై నిషేధం కొనసాగుతోందని తెలిపింది.

మొహర్రం అంబారి ఊరేగింపునకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఫాతిమా సేవాదళ్‌ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిష‌నర్ తరఫున కౌన్సిల్ పాండురంగారావు వాదనలు వినిపించారు. ఊరేగింపు కోసం ఇత‌ర రాష్ట్రాల నుంచి ఏనుగుల‌ను సొంత ఖ‌ర్చుల‌తో తెప్పించుకుంటారని, ఇందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన కోర్టు ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని వెల్లడించింది.