వైఎస్ ఫొటోలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ కార్యక్రమాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫొటోలు ఉంచడంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గతంలో సీఎంగా వ్యవహరించారని..
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ కార్యక్రమాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫొటోలు ఉంచడంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గతంలో సీఎంగా వ్యవహరించారని, ఆయన ఫొటో పెట్టడంలో అభ్యంతరం ఏముందని ప్రశ్నించింది. దీన్ని వ్యతిరేకిస్తూ వేసిన ఈ పిటిషన్ ను తాము విచారించలేమని స్పష్టం చేసింది. దీనిపై ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ అభిప్రాయాలు వినిపించారు. పిటిషనర్ టీడీపీ వ్యక్తి అని, చంద్రబాబు హయాంలో పసుపురంగులో ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చినప్పుడు ఈయన చాలా సుఖంగా ఫీలయ్యారని కోర్టుకు విన్నవించారు. టీడీపీ అధికారానికి దూరం కాగానే ఇలా పిటిషన్లు వేస్తున్నారని వ్యాఖ్యానించారు. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పథకాల ప్రచారంలో వైఎస్సార్ ఫొటో కూడా ఉపయోగించడం ఎక్కువగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే.