AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రియురాలిని చంపి..రెండేళ్ల తర్వాత అరెస్టయ్యాడు

గుంటూరు జిల్లా అలీనగర్​లో రెండున్నరేళ్ల కిందట అదృశ్యమైన బీటెక్ విద్యార్థిని నజీమా కేసును పోలీసులు ఛేదించారు.

ప్రియురాలిని చంపి..రెండేళ్ల తర్వాత అరెస్టయ్యాడు
Ram Naramaneni
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Nov 10, 2020 | 6:40 PM

Share

గుంటూరు జిల్లా అలీనగర్​లో రెండున్నరేళ్ల కిందట అదృశ్యమైన బీటెక్ విద్యార్థిని నజీమా కేసును పోలీసులు ఛేదించారు.  ప్రియుడు షేక్ కరీం అలియాస్ నాగూర్ ఆమెను అత్యంత పాశవికంగా హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పెళ్లి చేసుకోమని కోరడంతోనే నజీమాను అతడు హత్య చేసినట్లు పోలీసులు నిర్దారించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….గుంటూరు జిల్లాకు చెందిన షేక్ కరీం, నజీమా ప్రేమించుకున్నారు. అయితే నజీమా పెళ్లి ప్రస్తావన తీసుకురావంటంతో ఆమెను అడ్డుతొలగించుకోవాలని అతడు భావించాడు. పక్కా ప్లాన్ ప్రకారం వారిద్దరూ కలుసుకునే గదికి ఆమెను రప్పించి ఏకాంతంగా గడిపారు. ఆమె మరోసారి పెళ్లి ప్రస్తావన తీసుకురావటంతో ..ఆమె తలను గోడకేసి బాదాడు. తలకు గాయమై సృహ తప్పి పడిపోయిన ఆమెను గొంతునులిమి చంపేశాడు. అనంతరం ముందుగా తెచ్చి పెట్టుకున్న కట్టర్​తో శరీరాన్ని పార్టులు, పార్టులుగా కట్​చేసి ప్లాస్టిక్ కవర్​లో మూటగట్టి జనసంచారం లేని ప్రదేశంలో పడేశాడు. రెండురోజుల తర్వాత మళ్లీ వెళ్లి పెట్రోల్ పోసి శరీరాన్ని తగులబెట్టాడు. అనుమానిత డెడ్‌బాడీ దొరికిందన్న సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. శరీర అవయవాలను డీఎన్​ఏ టెస్టుకు పంపగా…డెడ్‌బాడీ అదృశ్యమైన నజీమాదిగా గుర్తించారు. ఈ కేసులో ముద్దాయిని రెండేళ్ల తర్వాత అరెస్టు చేసినట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి వివరించారు.

Also Read : 

దుబ్బాక ఓటమిపై స్పందించిన మంత్రి కేటీఆర్

తెలంగాణ : పిడుగుపాటు బాధిత కుటుంబాలకు పరిహారం విడుదల