దుబ్బాక ఓటమిపై స్పందించిన మంత్రి కేటీఆర్

దుబ్బాక ఓటమిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణ వచ్చిన 2014 జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా టీఆర్‌ఎస్ అద్భుతమైన విజయాలు నమోదు చేసిందని చెప్పారు.

దుబ్బాక ఓటమిపై స్పందించిన మంత్రి కేటీఆర్
Follow us

|

Updated on: Nov 10, 2020 | 4:28 PM

దుబ్బాక ఓటమిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణ వచ్చిన 2014 జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా టీఆర్‌ఎస్ అద్భుతమైన విజయాలు నమోదు చేసిందని చెప్పారు. తాము విజయాలకు పొంగిపోము, అపజయాలకు కుంగిపోమని చెప్పారు. దుబ్బాక ఫలితం తాము ఆశించినట్లు రాలేదని వెల్లడించారు.  ఈ ఓటమి తాము అప్రమత్తం అవడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఓటమిపై సమీక్ష చేసి లోటుబాట్లు తెలుసుకుంటామన్నారు. ఈ ఎన్నికల్లో ఓటు వేసిన 62 వేల మంది ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీని గెలిపించడానికి అహర్నిశలు శ్రమించిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read : ఉత్కంఠ పోరులో రఘునందన్‌ విజయం, బీజేపీ ఆఫీసులో సంబురాలు