‘పక్కా కమర్షియల్’ గా రాబోతున్న యాక్షన్ హీరో.. మారుతి డైరెక్షన్ లో గోపీచంద్ సినిమా..

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ సరైన హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో సీటీమార్ అనే సినిమా చేస్తున్నాడు.

'పక్కా కమర్షియల్’ గా రాబోతున్న యాక్షన్ హీరో..  మారుతి డైరెక్షన్ లో గోపీచంద్ సినిమా..
Follow us

|

Updated on: Dec 27, 2020 | 6:57 PM

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ సరైన హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో సీటీమార్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. కబడ్డీ బ్యాక్ డ్రాప్ ఈ సినిమా ఉండనుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుంది. ఈ సినిమాతర్వాత గోపీచంద్ దర్శకుడు తేజ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మారుతితో ఓ సినిమా చేయబోతున్నాడని గతంలో వార్తలు వచ్చాయి. అయితే దాదాపు టాలీవుడ్ యంగ్ హీరోలు అందరితో మారుతి వర్క్ చేశారు. ఇక ఇటీవల ప్రతిరోజూ పండగే సినిమా తర్వాత తదుపరి సినిమా ఎవరితో అనేది మారుతి ప్రకటించలేదు.అయితే ఇటీవల మాస్ రాజా రవితేజ లో సినిమా చేయాలని ప్రయత్నించాడు. కథకుడా నచ్చడంతో రవితేజ ఓకే చేసాడు. కానీ రెమ్యునరేషన్ దగ్గర కంప్రమైస్ కాలేక రవితేజ ఈ సినిమానుంచి తప్పుకున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ కథ గోపీచంద్ దగ్గరకు వెళ్లిందట. గోపీచంద్ కూడా కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక ఈ సినిమాకు ‘పక్కా కమర్షియల్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఫుల్ లెన్త్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు మారుతి. ఈ సినిమాలో గోపీచంద్ లాయర్ గా కనిపించబోతున్నాడని అంటున్నారు. జిఏ2 పిక్చర్స్ యూవి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించబోతున్నారు.