దేశ రాజధానిలో అగ్నిప్రమాదం

న్యూఢిల్లీ : దేశ రాజధానిలోని వికాస్‌ భవన్‌ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భవనంలోని ఆరో అంతస్తులోని ఎయిర్‌ కండిషనర్స్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో అగ్నిప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి ఐదు అగ్నిమాపక యంత్రాల చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. కాగా ఈ ప్రమాదంలో ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు వెల్లడికాలేదు. కాగా ఈనెల 6న దక్షిణ ఢిల్లీలోని సీజీఓ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ సీఐఎస్‌ఎఫ్‌ ఎస్‌ఐ మరణించగా, పలు […]

దేశ రాజధానిలో అగ్నిప్రమాదం
Follow us

| Edited By:

Updated on: Mar 11, 2019 | 4:24 PM

న్యూఢిల్లీ : దేశ రాజధానిలోని వికాస్‌ భవన్‌ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భవనంలోని ఆరో అంతస్తులోని ఎయిర్‌ కండిషనర్స్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో అగ్నిప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి ఐదు అగ్నిమాపక యంత్రాల చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. కాగా ఈ ప్రమాదంలో ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు వెల్లడికాలేదు. కాగా ఈనెల 6న దక్షిణ ఢిల్లీలోని సీజీఓ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ సీఐఎస్‌ఎఫ్‌ ఎస్‌ఐ మరణించగా, పలు కీలక పత్రాలు, ఫైళ్లు దగ్ధమయ్యాయి. 11 అంతస్థుల పండిట్‌ దీన్‌దయాళ్‌ అంత్యోదయ భవన్‌లోని ఐదో ఫ్లోర్‌లో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

Latest Articles