AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘పుల్వామా’ లాంటి మరో దాడికి జైషే మహ్మద్ ప్లాన్

న్యూఢిల్లీ: ‘పుల్వామా’ లాంటి మరో దాడికి జైషే మహ్మద్ ప్లాన్ చేస్తోందని ఇంటలిజెన్స్ హెచ్చరిక జారీ చేసింది. పుల్వామాకు ప్రతీకారంగా జైషే ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసినట్లు భారత్ ప్రకటించడంతో.. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జమ్మూకశ్మీర్‌‌లో ఆత్మాహుతి దాడులకు పథకం రచిస్తోందని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఆత్మాహుతి దాడి ఎలా చేయాలనేదానిపై ఇప్పటికే ఐదారుగురు ఉగ్రవాదులకు జైషే కమాండర్ శిక్షణ ఇస్తున్నట్లు ఇంటలిజెన్స్ వెల్లడించింది. బాంబుల తయారీ కోసం కశ్మీర్ లోయలోని యువతను జైషే కమాండర్ […]

‘పుల్వామా’ లాంటి మరో దాడికి జైషే మహ్మద్ ప్లాన్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 11, 2019 | 6:11 PM

Share

న్యూఢిల్లీ: ‘పుల్వామా’ లాంటి మరో దాడికి జైషే మహ్మద్ ప్లాన్ చేస్తోందని ఇంటలిజెన్స్ హెచ్చరిక జారీ చేసింది. పుల్వామాకు ప్రతీకారంగా జైషే ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసినట్లు భారత్ ప్రకటించడంతో.. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జమ్మూకశ్మీర్‌‌లో ఆత్మాహుతి దాడులకు పథకం రచిస్తోందని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఆత్మాహుతి దాడి ఎలా చేయాలనేదానిపై ఇప్పటికే ఐదారుగురు ఉగ్రవాదులకు జైషే కమాండర్ శిక్షణ ఇస్తున్నట్లు ఇంటలిజెన్స్ వెల్లడించింది. బాంబుల తయారీ కోసం కశ్మీర్ లోయలోని యువతను జైషే కమాండర్ రిక్రూట్ చేసుకుంటున్నట్లు కూడా నిఘా వర్గాలు పసిగట్టాయి.

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్‌పై జైషే మహ్మద్ ఉగ్రవాది కారు బాంబుతో దాడి చేసి.. 40 మందికిపైగా జవాన్లను పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ దాడి జరగడానికి రెండు రోజుల ముందే జమ్మూకశ్మీర్ రాష్ట్ర క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ ఇంటలిజెన్స్‌ను ఉగ్రదాడిపై హెచ్చరించినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇంటెలిజెన్స్ నిర్ల‌క్ష్యం కార‌ణంగానే 44 మంది సీఆర్పీఎఫ్ జ‌వాన్లు ప్రాణాలు కోల్పోయారని పలు వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఇంటలిజెన్స్ హెచ్చరికల జారీచేయడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.