AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli : కోహ్లీకి 71వ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రామ్‌కు పార్సిల్

Virat Kohli : వడోదర వన్డేలో కోహ్లీ కేవలం మ్యాచ్‌నే గెలిపించలేదు, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 28,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర రికార్డును కూడా దాటేశాడు. ఈ మ్యాచ్‌లో 93 పరుగులతో ఆకట్టుకున్న కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది

Virat Kohli : కోహ్లీకి 71వ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రామ్‌కు పార్సిల్
Virat Kohli
Rakesh
|

Updated on: Jan 12, 2026 | 8:42 AM

Share

Virat Kohli : మైదానంలో ప్రత్యర్థి బౌలర్ల పాలిట సింహస్వప్నంలా నిలిచే విరాట్ కోహ్లీ, నిజజీవితంలో మాత్రం చాలా సున్నిత మనస్కుడు. ముఖ్యంగా తన తల్లి పట్ల ఆయనకు ఉన్న ప్రేమ వెలకట్టలేనిది. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 93 పరుగులతో ఆకట్టుకున్న కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా తన అవార్డులన్నింటినీ ఏం చేస్తారో విరాట్ వెల్లడించిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మ్యాచ్ అనంతరం ప్రెజెంటర్ హర్షా భోగ్లే విరాట్‌ను సరదాగా ఒక ప్రశ్న అడిగారు. “విరాట్.. నీకు ఇప్పటికే 45 వన్డే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు వచ్చాయి. వాటన్నింటినీ దాచుకోవడానికి నీ ఇంట్లో ఒక ప్రత్యేక గది కావాలేమో?” అని అడిగారు. దీనికి కోహ్లీ నవ్వుతూ చాలా ఎమోషనల్ సమాధానం ఇచ్చారు. “నేను నా అవార్డులన్నింటినీ గురుగ్రామ్‌లోని మా అమ్మ దగ్గరకు పంపించేస్తాను. ఆమెకు ఆ ట్రోఫీలను దాచుకోవడం అంటే చాలా ఇష్టం. నా విజయాలను చూసి ఆమె ఎంతో గర్వంగా ఫీల్ అవుతుంటుంది. అందుకే నా అవార్డులన్నీ ఆమె దగ్గరే భద్రంగా ఉంటాయి” అని కోహ్లీ చెప్పుకొచ్చారు.

వడోదర వన్డేలో కోహ్లీ కేవలం మ్యాచ్‌నే గెలిపించలేదు, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 28,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర రికార్డును కూడా దాటేశాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన వారిలో సచిన్ టెండూల్కర్ (34,357) మొదటి స్థానంలో ఉండగా, కోహ్లీ (28,068) రెండో స్థానానికి చేరుకున్నాడు. అలాగే అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుల విషయంలోనూ సచిన్ (76) తర్వాత కోహ్లీ (71) రెండో స్థానంలో ఉన్నాడు. సచిన్ రికార్డుకు కోహ్లీ కేవలం 5 అవార్డుల దూరంలోనే ఉండటం విశేషం.

కోహ్లీ కెరీర్ ప్రారంభంలోనే తండ్రిని కోల్పోయినప్పటికీ, తల్లి నీడలో క్రమశిక్షణతో పెరిగి ఈ స్థాయికి చేరుకున్నారు. తన ప్రతి విజయానికి తల్లి ఆశీస్సులే కారణమని భావించే విరాట్, తనకు వచ్చే గౌరవాలను కూడా ఆమెకే అంకితం ఇస్తుంటారు. ఒక పక్క ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తూనే, మరోపక్క తన మూలాలను, అమ్మపై ఉన్న మమకారాన్ని చాటుకోవడం కోహ్లీ గొప్పతనానికి నిదర్శనం. రికార్డుల కంటే కూడా అమ్మ మొఖంలో కనిపించే ఆ చిన్న చిరునవ్వే తనకు అత్యున్నత అవార్డు అని విరాట్ మాటలను బట్టి అర్థమవుతోంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
తెలంగాణపై జనసేన ఫోకస్.. నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జీలపై కసరత్తు
తెలంగాణపై జనసేన ఫోకస్.. నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జీలపై కసరత్తు
ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..
ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..
ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంతంటే..
ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంతంటే..
మకరజ్యోతి దర్శనానికి సర్వం సిద్ధం.. కేవలం వారికి మాత్రమే అనుమతి
మకరజ్యోతి దర్శనానికి సర్వం సిద్ధం.. కేవలం వారికి మాత్రమే అనుమతి
ఒకే మ్యాచ్‌లో 414 పరుగులు..ఢిల్లీ కోటను కూల్చిన సోఫీ
ఒకే మ్యాచ్‌లో 414 పరుగులు..ఢిల్లీ కోటను కూల్చిన సోఫీ
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్
7 వైడ్లు, 4 నోబాల్స్.! పిల్లబచ్చా జట్టుపై 17 బంతులు ఓవర్‌..
7 వైడ్లు, 4 నోబాల్స్.! పిల్లబచ్చా జట్టుపై 17 బంతులు ఓవర్‌..
వడోదరలో విరాట్ విధ్వంసం..సెంచరీ మిస్సైనా రికార్డుల పంచ్ అదిరింది
వడోదరలో విరాట్ విధ్వంసం..సెంచరీ మిస్సైనా రికార్డుల పంచ్ అదిరింది