దారుణం : కూతురి అభ్యంతకర చిత్రాలు ల్యాప్టాప్లో బంధించిన తండ్రి
నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. కూతురి అభ్యంతకర చిత్రాలు లాప్టాప్లో నిక్షిప్తం చేశాడు తండ్రి.
నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. కూతురి అభ్యంతకర చిత్రాలు ల్యాప్టాప్లో నిక్షిప్తం చేశాడు తండ్రి. అవి అనూహ్యంగా కూతరు కంటపడటంతో ఆమె తీవ్రంగా కృంగిపోయింది. రెస్టారెంట్ నిర్వహిస్తోన్న ఆ కీచకుడు, మొదటి భార్య చనిపోవడంతో రెండో వివాహం చేసుకున్నాడు. రెండో భార్య కూతురికి తెలియకుండా ఆ ఫోటోలు తీశాడు నీచుడు.
తన తండ్రి ల్యాప్టాప్లో ఫోటోలు చూసి తల్లడిల్లిన కూతురు, తల్లి సహాయంతో నాచారం పోలీస్ లకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని మొదట అరెస్ట్ చేసిన పోలీసులు అతడికి కరోనా సోకడంతో చికిత్స తీసుకునేందుకు అనుమతించారు. ప్రస్తుతం అతడికి కరోనా తగ్గడంతో మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
Also Read :
ఇసుక విధానంలో మార్పులు, మరోసారి జగన్ మార్క్ నిర్ణయాలు !