అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేకు ‘ఎడ్డీ’ వెయ్యి కోట్లు ఎందుకిచ్చారంటే?
తను సీఎం కావడానికి ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎదియూరప్ప .. అనర్హత వేటు పడిన (మాజీ) ఎమ్మెల్యేను ‘ ప్రసన్నం ‘ చేసుకోవడానికి ‘ కోట్ల ‘ రూపాయల ‘ నజరానా ‘ ఇచ్చారట. నారాయణ గౌడ అనే ఆ సభ్యుడు తాజాగా తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలో కృష్ణరాజపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న తాను…. తన ఈ ప్రాంత అభివృధ్ది కోసం రూ. 700 కోట్లు కేటాయించవలసిందిగా ఎదియూరప్ప నివాసానికి వెళ్లి కోరానని, అయితే ఇంతకన్నా […]
తను సీఎం కావడానికి ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎదియూరప్ప .. అనర్హత వేటు పడిన (మాజీ) ఎమ్మెల్యేను ‘ ప్రసన్నం ‘ చేసుకోవడానికి ‘ కోట్ల ‘ రూపాయల ‘ నజరానా ‘ ఇచ్చారట. నారాయణ గౌడ అనే ఆ సభ్యుడు తాజాగా తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలో కృష్ణరాజపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న తాను…. తన ఈ ప్రాంత అభివృధ్ది కోసం రూ. 700 కోట్లు కేటాయించవలసిందిగా ఎదియూరప్ప నివాసానికి వెళ్లి కోరానని, అయితే ఇంతకన్నా ఎక్కువగానే.. రూ. 300 కోట్లు కలిపి మొత్తం వెయ్యి కోట్లు ఇస్తానని ఆయన హామీ ఇచ్చారని గౌడ తన సహచరులకు చెప్పారు. ఆ తరువాత ఆ హామీ నెరవేర్చారని తెలిపారు. ‘ అంతటి గొప్ప వ్యక్తికి మద్దతు ఇవ్వడంలో తప్పులేదు కదా ? అందుకే సపోర్ట్ ఇచ్చాను ‘ అని అన్నారు. ఇలాగే మాండ్యా నియోజకవర్గ ఎమ్మెల్యే కి కూడా ఎదియూరప్ప సహాయం చేశారని, ఈ విషయాన్ని ఆ శాసన సభ్యుడు స్వయంగా చెప్పారని నారాయణగౌడ గుర్తు చేశారు. అయితే.. అనర్థత వేటు పడిన ఎమ్మెల్యేలతో తనకు సంబంధం లేదని ఎడ్డీ చెప్పడం విశేషం. అయినా ఎదియూరప్ప ముఖ్యమంత్రి కావడానికి ముందే నారాయణగౌడ.. ఆయన ఇంటికి వెళ్లి తన నియోజకవర్గ అభివృధ్దికి కోట్ల సాయం చేయాలని కోరడంలోని మతలబు ఏమిటో అర్థం కావడం లేదని అంటున్నారు. అప్పటికి ఎడ్డీ సీఎం కూడా కాదు. మరి.. ‘ అనర్హ ‘ సభ్యుడికి ఒక్కసారిగా మూడు వందల కోట్లు ఎక్కువే ఇఛ్చి ‘ ప్రసన్నం ‘ చేసుకోవడంలోని ఔచిత్యమేమిటన్నది తెలియాల్సి ఉంది.