దిల్ రాజు కుమార్తె ఎమోషనల్ పోస్ట్.. ‘ఐ మిస్ యూ అమ్మా’..
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. తన తల్లికి సంబంధించిన బాల్య జ్ఞాపకాన్ని షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది హన్షిత. నేడు దిల్ రాజు మొదటి భార్య అనిత జయంతి. ఈ సందర్భంగా 'పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా.. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా..
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. తన తల్లికి సంబంధించిన బాల్య జ్ఞాపకాన్ని షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది హన్షిత. నేడు దిల్ రాజు మొదటి భార్య అనిత జయంతి. ఈ సందర్భంగా ‘పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా.. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా.. నీ జ్ఞాపకాలు ఎల్లప్పుడూ నాతోనే ఉంటాయి.. వాటితోనే నేను జీవిస్తున్నా. కానీ కొన్ని రోజులు నేను నీతో ఉన్న ఎన్నో జ్ఞపకాలు, నీతో కలిసి దిగిన ఫొటోలు దిగాను. నీ చిరునవ్వు దృశ్యాల చిత్రాలెన్నో’.. అంటూ ఇన్స్టాగ్రామ్లో ఎమోషనల్ పోస్ట్ చేసింది.
కాగా దిల్ రాజు మొదటి భార్య అనిత అనారోగ్యం కారణంగా 2017లో మరణించారు. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్న దిల్ రాజుకి.. తన కూతురే స్వయంగా రెండో పెళ్లి చేశారు. బరువైన బాధ్యతను భుజాన వేసుకుని పెళ్లి పెద్దగా వ్యవహరించింది. మొత్తానికి తన తండ్రికి రెండో వివాహం చేసింది. బ్రాహ్మణ యువతి అయిన తేజస్వినీని.. దిల్ రాజు రెండో వివాహం చేసుకున్నారు.
Read More:
ఎమ్మెల్యే రోజా గన్మెన్కి కరోనా పాజిటివ్..