ఎమ్మెల్యే రోజా గన్మెన్కి కరోనా పాజిటివ్..
ఇప్పుడు నగరి ఎమ్మెల్యే రోజా గన్మెన్కి కూడా కరోనా వైరస్ సోకినట్టు సమాచారం. కొన్ని రోజులుగా అనారోగ్యంగా ఉన్న అతనికి పరీక్షలు చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే అతన్ని తిరుపతిలోని స్విమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే అతనితో కాంటాక్ట్ ఉన్న అందరికీ...
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విపరీతంగా వ్యాపిస్తోన్న సంగతి తెలిసిందే కదా. దీంతో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విలయతాండవం సృష్టిస్తుంది కోవిడ్ మహమ్మారి. అందులోనూ లాక్ డౌన్ సడలించడంతో ఈ వైరస్ వ్యాప్తి మరింత ఎక్కువవుతుంది. ఇక పలువురు ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు సిబ్బంది, నటులపై కూడా ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు ఈ వైరస్ బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
తాజాగా ఇప్పుడు నగరి ఎమ్మెల్యే రోజా గన్మెన్కి కూడా కరోనా వైరస్ సోకినట్టు సమాచారం. కొన్ని రోజులుగా అనారోగ్యంగా ఉన్న అతనికి పరీక్షలు చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే అతన్ని తిరుపతిలోని స్విమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే అతనితో కాంటాక్ట్ ఉన్న అందరికీ టెస్టులు నిర్వహిస్తున్నారు వైద్యులు. కాగా గన్మెన్ కరోనా బారిన పడటంతో రోజా కూడా స్పందించారు. తన ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ప్రస్తుతం మా ఫ్యామిలీ సేఫ్గా ఉందని పేర్కొన్నారు. అలాగే వ్యాధిబారిన పడిన వ్యక్తి గత 18 రోజులుగా విధులకు రావడం లేదని చెప్పారు రోజా.
Read More:
చైనా బ్రాండ్ ఫోన్ ప్రచారానికి గుడ్ బై చెప్పిన యంగ్ హీరో..?
బ్రేకింగ్: అతి పెద్ద సోలార్ విద్యుత్తు ప్లాంటును జాతికి అంకితం చేసిన మోదీ