రాయలసీమలో రత్నాల వేట… దొరికితే లక్షాధికారే..!
తొలకరి పలకరింపు కొంతమందిని లక్షాధికారులుగా మారుస్తుంది. ఆశ్చర్యపోతున్నారా.? ఇది నిజమే! అది కూడా మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది.
ఎండాకాలంలో సూర్యుడు భగభగలకు తాళలేని జనాలకు తొలకరి వస్తే చాలు ఎంతో హాయిగా ఉంటుంది. వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో ఎక్కడ చూసినా జల దృశ్యం కళ్లకు కనిపిస్తుంది. అయితే ఈ తొలకరి పలకరింపు కొంతమందిని లక్షాధికారులుగా మారుస్తుంది. ఆశ్చర్యపోతున్నారా.? ఇది నిజమే! అది కూడా మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఇంతకీ ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. తొలకరి వర్షాలు పడితే చాలు కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దుల్లోని కొన్ని గ్రామాలలో సందడి వాతావరణం నెలకొంటుంది. వారికి తొలకరి జల్లులు మరింత ప్రత్యేకంగా మారతాయి. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని పలు గ్రామాల్లో వజ్రాల వేట మొదలవుతుంది. పొలాల్లో వజ్రాలు పోలిన రాళ్లలో నిజమైన వజ్రాలు దొరుకుతుంటాయి.
అక్కడ ఇప్పటిదాకా వందల సంఖ్యలో వజ్రాలు దొరికాయి. ఎన్నో ఏళ్లుగా ఈ వజ్రాల వేట కొనసాగుతున్నట్లు అక్కడి గ్రామస్తులు చెబుతున్నారు. గత వారం రోజుల్లో 6 వజ్రాలు దొరికాయని తెలుస్తోంది. ఇతర జిల్లాల నుంచి సైతం ఎంతోమంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తుంటారు. మహిళలు చంటి బిడ్డలతో వచ్చి మరీ వజ్రాల కోసం వెతుకుతుంటారు. ఇంతవరకు బాగానే ఉంది గానీ.. ఈ వజ్రాల వేట అక్కడున్న రైతులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎక్కడెక్కడ నుంచో వస్తున్న జనం డైమెండ్స్ కోసం పొలాలను ఇష్టానుసారంగా తొక్కేస్తుండటం.. దున్నేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు లబోదిబోమంటున్నారు. కొంతమంది అయితే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.
Also Read:
రేపటి నుంచి శ్రీవారి ఉచిత దర్శనం టోకెన్లు జారీ…
జగన్ కీలక నిర్ణయం.. త్వరలోనే వైద్యశాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.!
ఏపీ వెళ్ళాలనుకునేవారికి ముఖ్య గమనిక.. జగన్ సర్కార్ కీలక ప్రకటన..
నిరుద్యోగులకు శుభవార్త.. గురుకులాల్లో టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
దసరా వరకు స్కూల్స్ తెరిచే ప్రసక్తి లేదు..!
యోగీ సర్కార్పై ప్రశంసలు.. ఇమ్రాన్పై సెటైర్లు.. పాక్ జర్నలిస్ట్ ట్వీట్ వైరల్..