జగన్ సర్కార్ కీలక ప్రకటన.. సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు కొనసాగుతాయి..

అన్‌లాక్‌ 1లో భాగంగా రేపట్నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఎత్తివేయనున్నారని తాజాగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని ఏపీ నోడల్ ఆఫీసర్ కృష్ణబాబు వెల్లడించారు.

జగన్ సర్కార్ కీలక ప్రకటన.. సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు కొనసాగుతాయి..
Follow us

|

Updated on: Jun 07, 2020 | 7:34 PM

అన్‌లాక్‌ 1లో భాగంగా రేపట్నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఎత్తివేయనున్నారని తాజాగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని ఏపీ నోడల్ ఆఫీసర్ కృష్ణబాబు వెల్లడించారు. కోవిడ్ 19 మార్గదర్శకాల ప్రకారం సరిహద్దు చెక్‌పోస్టులను యధావిధిగా పర్యవేక్షిస్తామన్నారు. రాష్ట్రంలో ఒక్కసారిగా పాజిటివ్ కేసులు పెరగడంతో ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు, రైల్వేస్టేషన్స్, డొమెస్టిక్ ఎయిర్ పోర్టులలో మరికొన్ని రోజులు తనిఖీలు జరుగుతాయన్నారు.

ఏపీకి వచ్చేవారందరూ కూడా ఖచ్చితంగా స్పందన వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు. పైన తెలిపిన చెక్ పాయింట్ల వద్ద అందరి వివరాలను నమోదు చేసుకుని ఆరోగ్యశాఖ ప్రోటోకాల్ ప్రకారం టెస్టులు చేస్తామన్నారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చినా కూడా 7 రోజుల హోం క్వారంటైన్‌లో ఉండాలన్నారు. వీటిని అందరూ కూడా తప్పక గమనించాలని నోడల్ ఆఫీసర్ పేర్కొన్నారు. కాగా, అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులకు తెలంగాణ ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వలేదు. తెలంగాణ ప్రభుత్వం నుండి అనుమతి పొందిన తర్వాత హైదరాబాద్ నుండి జిల్లాలకు బస్సులు నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ సిద్ధంగా ఉందన్నారు.

Also Read: 

పేదలకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్.. జూలై 8న ఇళ్లపట్టాలు పంపిణీ..

భక్తులకు గుడ్ న్యూస్.. జూన్ 10 నుంచి దుర్గమ్మ దర్శనానికి అనుమతి..

గుడ్ న్యూస్.. ఏపీలో విద్యార్ధులకు ఫ్రీగా స్మార్ట్ ఫోన్స్..

మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..

కులాంతర వివాహాలు చేసుకునేవారికి గుడ్ న్యూస్.. దరఖాస్తు చేసుకోండిలా..

షాకింగ్: గూగుల్ సెర్చ్‌లో వాట్సాప్ నెంబర్లు.. ప్రమాదంలో యూజర్ల వివరాలు..

ఇన్‌స్టాగ్రామ్‌ కీలక నిర్ణయం.. ఇకపై వాటికి అనుమతి తప్పనిసరి..