AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేవంత్‌పై పోసాని ఫైర్.. లంచం ఇస్తూ రెడ్‌హ్యాండ్‌గా దొరికిన వ్యక్తి అంటూ..!

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డిపై నటుడు పోసాని కృష్ణమురళి ఫైర్ అయ్యారు. రూ.50 లక్షలు లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ వ్యక్తి, జైలుకు వెళ్లొచ్చిన వ్యక్తి కేటీఆర్‌ అవినీతి పరుడని అనడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.

రేవంత్‌పై పోసాని ఫైర్.. లంచం ఇస్తూ రెడ్‌హ్యాండ్‌గా దొరికిన వ్యక్తి అంటూ..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 07, 2020 | 7:12 PM

Share

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డిపై నటుడు పోసాని కృష్ణమురళి ఫైర్ అయ్యారు. రూ.50 లక్షలు లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ వ్యక్తి, జైలుకు వెళ్లొచ్చిన వ్యక్తి కేటీఆర్‌ అవినీతి పరుడని అనడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి మాటలు ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నాయని వెల్లడించారు. ఎవరు మంచివాళ్లో తనకు తెలుసని ఆయన అన్నారు. కేటీఆర్, హరీశ్ రావు నూటికి నూరు శాతం నిజాయతీ పరులని.. తెలంగాణ భవిష్యత్తుకు వారు రెండు కళ్లలాంటి వారని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇక కేటీఆర్ అవినీతి చేశారని నిరూపిస్తే, తన మాటలు వెనక్కి తీసుకొని, టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని పోసాని పేర్కొన్నారు. రూ.80 వేల కోట్లు ఖర్చుతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ని పూర్తి చేశారని, అంత గొప్ప ప్రాజెక్ట్‌ని ప్రతిపక్షం కూడా అభినందించాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ హయాంలో నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ కట్టినప్పుడు ప్రతిపక్షం అభినందించిందని ఆయన గుర్తు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంచి నాయకుడని, ఆయన పక్కన నిజాయితీ పరులుంటే మంచిదని వ్యాఖ్యానించారు.

రెండు రాష్ట్రాల్లో సమర్ధులైన ముఖ్యమంత్రులు ఉన్నారని పోసాని కితాబిచ్చారు. జగన్ ప్రజల మధ్య ఉండే నాయకుడని, మరో పదిహేనేళ్లు ఏపీలో వైసీపీనే అధికారంలో ఉంటుందని అన్నారు. బాలకృష్ణ చాలా నిజాయితీపరుడని, ఆయన కోపం నిమిషం మాత్రమేనని పోసాని పేర్కొన్నారు.

Read This Story Also: Breaking: అర్జున్ మేనల్లుడు, నటుడు చిరంజీవి హఠాన్మరణం..!

Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..