22 April 2025
Subhash
కేంద్ర ప్రభుత్వం పీఎం ఏసీ యోజన 2025 స్కీమ్ కింద అందరికి ఉచితంగా ఏసీలను అందిస్తుందని ఓవార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దీని కింద 1.5 కోట్ల 5-స్టార్ ఎయిర్ కండిషనర్లను ఉచితంగా పంపిణీ చేస్తామని రాసి ఉంది. పోస్ట్లో వీలైనంత త్వరగా ఫారమ్ నింపమని విజ్ఞప్తి ఉంది.
30 రోజుల్లోపు మీ ఇంట్లో ఏసీ ఇన్స్టాల్ చేయబడుతుందని పేర్కొంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. మరి నిజంగా ఇలాంటి పథకం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందా? ఇప్పుడు చూద్దాం.
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఉచిత ఏసీ ఇచ్చే ఈ పథకం గురించి ప్రచారం జరుగుతోంది.
ప్రభుత్వం ఈ పథకాన్ని మే 2025 నుండి ప్రారంభించబోతోందని వైరల్ అవుతోంది. దీని కోసం ఇంధన మంత్రిత్వ శాఖ 1.5 కోట్ల ఏసీలను ఆర్డర్ చేసినట్లు కూడా ఉంది.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఈ వైరల్ పోస్ట్ వాస్తవాన్ని తనిఖీ చేసింది. ప్రభుత్వం అలాంటి పథకాన్ని ప్రకటించలేదని తేలింది.
ఈ వాదన పూర్తిగా అబద్ధమని, ఏ ప్రభుత్వ శాఖ లేదా ఇంధన మంత్రిత్వ శాఖ అటువంటి ఫారమ్ను జారీ చేయలేదని PIB స్పష్టం చేసింది.
ఇటువంటి సోషల్ మీడియా పోస్టుల ఉద్దేశ్యం ప్రజలను తప్పుదారి పట్టించడం, వారి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడమేనని, అనధికార లింక్లపై క్లిక్ చేయవద్దు.