నిరుద్యోగులకు శుభవార్త.. గురుకులాల్లో టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
కరోనా కాలంలో నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలోని 16 ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు..

కరోనా కాలంలో నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలోని 16 ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 10 నుంచి ఆన్లైన్లో అప్లికేషన్లు స్వీకరిస్తామని గిరిజన గురుకులాల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు.
తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్, లైబ్రేరియన్, టెక్నికల్ అసిస్టెంట్ తదితర పోస్టులను భర్తీ చేస్తామని ఆయన తెలిపారు. కాగా, ఈ నోటిఫికేషన్కు సంబంధించి పూర్తి వివరాల కోసం www.tgtwgurukulam.telangana.gov.in అఫీషియల్ వెబ్సైట్ను సందర్శించండి.
Also Read:
ఏపీ వెళ్ళాలనుకునేవారికి ముఖ్య గమనిక.. జగన్ సర్కార్ కీలక ప్రకటన..
పేదలకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్.. జూలై 8న ఇళ్లపట్టాలు పంపిణీ..