రూ.40 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి డ్రగ్ రాకెట్ గుట్టు రట్టయింది. మంగళవారం ఢిల్లీపోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో రూ.40 కోట్ల విలువైన 10 కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి డ్రగ్ రాకెట్ గుట్టు రట్టయింది. మంగళవారం ఢిల్లీపోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో 10 కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్ వద్ద లో పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో హెరాయిన్ తో లారీలో వెళుతున్న ఇద్దరిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.40 కోట్ల విలువైన హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.