కరోనా వేళ వరంగల్ జిల్లాలో క్రికెట్ ఫైట్.. బ్యాట్లు, వికెట్లతో…
ఓ వైపు దేశ ప్రజలంతా కరోనాతో గజగజ వణికిపోతుంటే.. మరోవైపు వరంగల్ అర్బన్ జిల్లాలో విద్యార్ధులు క్రికెట్ ఆడుతూ ఘర్షణకు దిగారు. ఇప్పటికే వరంగల్ అర్బన్ జిల్లా రెడ్ జోన్లో ఉన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ కాజీపేట హైస్కూల్లో విద్యార్ధులు లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ… క్రికెట్ మ్యాచ్ ఆడారు. అయితే క్రమంలో రెండు జట్ల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో క్రికెట్ ఆడుకుంటున్న బ్యాట్లు, వికెట్లతో తలలు పగలగొట్టుకునేలా కొట్టుకున్నారు. ఈ ఫైట్లో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. […]
ఓ వైపు దేశ ప్రజలంతా కరోనాతో గజగజ వణికిపోతుంటే.. మరోవైపు వరంగల్ అర్బన్ జిల్లాలో విద్యార్ధులు క్రికెట్ ఆడుతూ ఘర్షణకు దిగారు. ఇప్పటికే వరంగల్ అర్బన్ జిల్లా రెడ్ జోన్లో ఉన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ కాజీపేట హైస్కూల్లో విద్యార్ధులు లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ… క్రికెట్ మ్యాచ్ ఆడారు. అయితే క్రమంలో రెండు జట్ల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో క్రికెట్ ఆడుకుంటున్న బ్యాట్లు, వికెట్లతో తలలు పగలగొట్టుకునేలా కొట్టుకున్నారు. ఈ ఫైట్లో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరుకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు.