విజయవాడలో క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ పాగా, ఆటకట్టించిన పోలీసులు
విజయవాడలో ఆన్లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొగల్రాజపురంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఈ ముఠా బెట్టింగ్ నిర్వహిస్తోంది.
విజయవాడలో ఆన్లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొగల్రాజపురంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఈ ముఠా బెట్టింగ్ నిర్వహిస్తోంది. పక్కా సమాచారంతో సోదాలు నిర్వహించిన పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారు. వారంతా తూర్పుగోదావరి జిల్లా వాసులుగా గుర్తించారు.
‘అవతార్’ అనే యాప్ ద్వారా ఈ గ్యాంగ్ ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు విజయవాడ డీసీపీ హర్షవర్ధన్ తెలిపారు. బెట్టింగ్ కోసం వినియోగించిన లైన్ బాక్స్, 25 సెల్ఫోన్స్, ఎల్సీడీ మానిటర్, లాప్టాప్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన సూత్రధారి నవీన్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. రూ.12 లక్షల వరకు బెట్టింగ్ జరిగిందని పోలీస్ వర్గాల సమాచారం. కాగా బెట్టింగ్పై ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలు సహకరించాలని డీసీపీ హర్షవర్ధన్ కోరారు.
Also Read :
ఏపీలో రేపటి నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం.. ఈ రూల్స్ తప్పనిసరి
వానలే వానలు : మరో అల్పపీడనం, ఏపీకి భారీ వర్ష సూచన
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం : ముగ్గురు యువకులు దుర్మరణం