AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓటు వేసినవారికే అన్ని అవకాాశాలు.. గ్రేటర్‌లో ఓటింగ్ తగ్గడంపై సీరియస్‌గా స్పందించిన సీపీ సజ్జనార్..

గ్రేటర్ ఎన్నికల్లో ఓటింగ్ తగ్గడంపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓటు హక్కు కాదు...ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో అది ఎక్కడా కనిపించలేదన్నారు.

ఓటు వేసినవారికే అన్ని అవకాాశాలు.. గ్రేటర్‌లో ఓటింగ్ తగ్గడంపై సీరియస్‌గా స్పందించిన సీపీ సజ్జనార్..
Sanjay Kasula
|

Updated on: Dec 01, 2020 | 6:01 PM

Share

గ్రేటర్ ఎన్నికల్లో ఓటింగ్ తగ్గడంపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓటు హక్కు కాదు…ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో అది ఎక్కడా కనిపించలేదన్నారు. చాలా మంది ఓటర్లు తమ ఓటు హక్కు ఉపయోగించుకునేందుకు ఆసక్తి చూపకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

దీనిపై ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ కొత్త ఆలోచన చేయాలన్నారు. ఆఖరికి విద్యార్థులకు సీట్లు పొందాలన్నా, సర్టిఫికెట్ తీసుకోవాలన్న కచ్చితంగా ఓటు వేసి ఉండాలన్న నిబంధన పెట్టాలి అని సూచించారు. ఓటు వేసిన వ్యక్తులకే ఉద్యోగ, విద్యావకాశాలు కల్పించాలన్నారు. చివరికి మంచినీటి కనెక్షన్ పొందాలన్నా సరే ఓటు వేసి ఉండాలన్న నిబంధనను తీసుకురావాలని అభిప్రాయపడ్డారు.

ఏదైనా పథకానికి దరఖాస్తు చేయాలంటే లక్షల్లో జనాలు ముందుకు వేస్తారు..అదే  ఓటు వేయాలంటే మాత్రం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఉదయం నుంచి గ్రేటర్ పరిధిలోని అన్ని పోలింగ్ బూత్ ల దగ్గర తిరుగుతున్నాను.. ఎక్కడా.. జనాల క్యూలైన్లు కనిపించలేదని అన్నారు.  ప్రభుత్వ పథకాలు వర్తింపజేసేలా నిర్ణయం తీసుకుంటేనే ఓటింగ్ శాతం పెరుగుతుందని అన్నారు.