చనిపోయినా మరికొందరి జీవితాల్లో వెలుగులు, కానిస్టేబుల్​ అంత్యక్రియల్లో పాల్గొన్న సీపీ సజ్జనార్

అతడో పోలీస్ కానిస్టేబుల్. ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. భార్య, తల్లిదండ్రులతో జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.

చనిపోయినా మరికొందరి జీవితాల్లో వెలుగులు, కానిస్టేబుల్​ అంత్యక్రియల్లో పాల్గొన్న సీపీ సజ్జనార్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 22, 2020 | 1:51 PM

అతడో పోలీస్ కానిస్టేబుల్. ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. భార్య, తల్లిదండ్రులతో జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఈ క్రమంలో ఊహించని ప్రమాదం తరుముకొచ్చింది. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో సదరు కానిస్టేబుల్ గాయపడి..చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసు అధికారులు అవయవ దానం చేయాలని కోరగా, తల్లిదండ్రులు గుండె దిటవుతో సరేనన్నారు. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఈ సంఘటన వికారాబాద్‌ జిల్లా పరిగి మండల పరిధి బాబాపూర్‌లో శనివారం చోటుచేసుకుంది.

తాను చనిపోయినా..ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపిన కానిస్టేబుల్ ఆంజనేయులు అంత్యక్రియల్లో సైబరాబాద్​ సీపీ సజ్జనార్ పాల్గొన్నారు. వికారాబాద్​ జిల్లా పరిగి మండలం బాబాపూర్ గ్రామంలో జరిగిన ఆంజనేయులు అంత్యక్రియల్లో.. స్మశానవాటిక వరకు పాడె మోశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి డిపార్ట్‌మెంట్ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

వివరాలు ఇలా ఉన్నాయి…

సైబరాబాద్ హెడ్ క్వార్టర్స్​లో ఆంజనేయులు గత రెండేళ్లుగా ఏఆర్ కానిస్టేబుల్​గా పని చేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం విధులకు హాజరయ్యేందుకు మోటార్ సైకిల్‌పై వస్తుండగా సోమన్ గుర్తి గేటు వద్ద ఆంజనేయులును బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడిన ఆంజనేయులు కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. ఆంజనేయులు అవయవాలను కుటుంబ సభ్యులు జీవన్ దాన్ సంస్థకు ఇచ్చారు. చనిపోయిన ఆంజనేయులు మరొకరికి ప్రాణదానం చేశారని… అతన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సీపీ సజ్జనార్ కోరారు.