Shocking Animal Cruelty : పండు తిన్నదని ఆవును కత్తితో పొడిచి చంపిన వ్యాపారి.. కోపంలో ఆ పనిచేశానంటూ పశ్చాతాపం

కోపం చిరాకు జీవితంలో భాగం చేసుకుంటూ నిత్యం ఆందోళ వ్యక్తం చేస్తూ అందమైన జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటూ గడిపేస్తోంది నేటి  తరం.. తాజాగా ఓ పండ్ల వ్యాపారి... చిన్న పండు తిన్నదని కోపంతో అభం శుభం తెలియని సాధు జంతువు ఆవును కత్తితో పొడిచి..

Shocking Animal Cruelty : పండు తిన్నదని ఆవును కత్తితో పొడిచి చంపిన వ్యాపారి.. కోపంలో ఆ పనిచేశానంటూ పశ్చాతాపం
Follow us

|

Updated on: Feb 21, 2021 | 12:07 PM

Shocking Animal Cruelty : రోజు రోజుకీ మనుషుల్లో మంచితనం.. మానవత్వం తగ్గిపోతుంది.. సహనం అన్న మాట ఉన్నాదని మరచిపోతున్నారు. చిన్న చిన్న విషయాలకే ఓ రేంజ్ లో రియాక్ట్ అయ్యి హంతకులుగా మారుతున్నారు లేదా ఆత్మహత్యలు చేసుకుని జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు.

కోపం చిరాకు జీవితంలో భాగం చేసుకుంటూ నిత్యం ఆందోళ వ్యక్తం చేస్తూ అందమైన జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటూ గడిపేస్తోంది నేటి  తరం.. తాజాగా ఓ పండ్ల వ్యాపారి… చిన్న పండు తిన్నదని కోపంతో అభం శుభం తెలియని సాధు జంతువు ఆవును కత్తితో పొడిచి చంపేశాడు.. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

రాయ్‌గడ్ లో మురుడ అనే ప్రాంతంలో తోఫిక్ బషిర్ ముజవార్ అనే వ్యక్తి స్థానికంగా పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. అయితే ఆ ప్రాంతంలో పశువులు ఆహారం కోసం సంచరిస్తుంటాయి. ఈ నేపథ్యంలో బషీర్ ఓ వైపు పండ్లను కొనడానికి వచ్చిన వినియోగదారులను చూసుకుంటూ.. మరోవైపు ఆవులు, అక్కడికి వచ్చే పశువులు బండి మీద ఉన్న పండ్లను తినకుండా చూసుకోవడం ఒక ఎత్తుగా మారింది. ఈ నేపథ్యంలో కస్టమర్లతో మాట్లాడుతున్న సమయంలో ఓ ఆవు బండిలోని బొప్పాయి పండు తింది. దీంతో బషీర్ కోపంతో వెంటనే చేతిలో ఉన్న కత్తితో ఆవు పొట్టలో కసితీరా పొడిచాడు. తీవ్రరక్తస్రావంతో ఆవు అక్కడిక్కడే మరణించింది. ఈ విషయం తెలుసుకున్న ఆవు యాజమాని పండ్ల వ్యాపారిపై పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని రిమాండ్‌కు తరలించారు. అంతకుముందు తాను కావాలని ఈ నేరం చేయలేదని, క్షణికావేశంలో జరిగిపోయిందని విచారణలో భాగంగా అంగీకరించినట్లు పోలీసులు చెప్పారు.

Also Read: