Mother Language Day : నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం.. భారత్‌లో అంతరించి పోయే దిశలో ఎన్ని భాషలున్నాయో తెలుసా..!

నీతి, నిజాయితీ, మంచి నడవడిక నేర్పేది మాతృభాష. తల్లి భాష లేనిదే మానవజాతికి వికాసం లేదు. అన్యభాషలు ఎన్ని నేర్చినప్పటికీ.. మాతృభాషలో ప్రవీణుడు కానివాడు... విజ్ఞాన సముపార్జన చేయలేడు. అలాంటి తల్లిభాష నేడు తల్లడిల్లుతోంది.. అమ్మ భాషను రక్షించుకోవడానికి 1999లో 30వ యునెస్కో మహాసభ..

Mother Language Day : నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం.. భారత్‌లో అంతరించి పోయే దిశలో ఎన్ని భాషలున్నాయో తెలుసా..!
Follow us

|

Updated on: Feb 21, 2021 | 10:32 AM

International Mother Language Day: నీతి, నిజాయితీ, మంచి నడవడిక నేర్పేది మాతృభాష. తల్లి భాష లేనిదే మానవజాతికి వికాసం లేదు. అన్యభాషలు ఎన్ని నేర్చినప్పటికీ.. మాతృభాషలో ప్రవీణుడు కానివాడు… విజ్ఞాన సముపార్జన చేయలేడు. అలాంటి తల్లిభాష నేడు తల్లడిల్లుతోంది. ప్రపంచవ్యాప్తంగా వేలకొద్ది మాతృభాషలు కనుమరుగయ్యే స్థితిలో వున్నాయంటూ యునెస్కో హెచ్చిరిస్తోంది. ఆంగ్లభాష అనే రోడ్డు రోలర్ కిందపడి ఇప్పటికే బక్కచిక్కిన మాతృభాషలెన్నో నలిగి కనుమరుగైపోయాయని.. ఇటీవలి యునెస్కో సర్వే తేల్చింది.

అమ్మ భాషను రక్షించుకోవడానికి 1999లో 30వ యునెస్కో మహాసభ ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా వేల స్థానిక భాషలున్నా.. కొన్ని వందల భాషలకే విద్యా వ్యవస్థలో చోటు దక్కింది. ఈ రోజును ఎంచుకోవడానికి ప్రధాన కారణం బంగ్లాదేశ్‌. దేశ విభజన తర్వాత బంగ్లాదేశ్‌ను తూర్పు పాకిస్థాన్‌గా పిలిచేవారు. వారి మాతృభాష బెంగాలీ. కానీ, వారి భాషకు తగిన గుర్తింపు లేదు. అందుకే, తమ భాషకు గుర్తింపు ఇవ్వాలని అక్కడి ప్రజలు ఉద్యమించారు. ఆ ఉద్యమం 1952 నుంచి నాలుగేళ్లపాటు సాగింది. విద్యార్థులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులంతా దీనిలో పాల్గొన్నారు. ఉద్యమాన్ని అణచివేసేందుకు పాక్‌ ప్రభుత్వం.. మేధావుల్ని, అధ్యాపకులను జైళ్లలో వేసింది. ఫిబ్రవరి 21న పోలీసులతో కాల్పులు జరిపించింది. మాతృభాష కోసం మొదలుపెట్టిన ఆ ఉద్యమంలో నెత్తురు ఏరులైపారింది. మాతృభాష పరిరక్షణ కోసం నలుగురు యువ కులు అసువులు బాశారు. చివరికి దిగొచ్చిన పాక్‌ ప్రభుత్వం 1956లో బెంగాలీ, ఉర్దూ భాషలను అధికార భాషలు చేసింది. అయితే, 1953 నుంచే బంగ్లాదేశ్‌ ప్రజలు ఫిబ్రవరి 21ని మృతవీరుల దినోత్సవంగా జరుపుకొంటున్నారు. ఆ దేశ అభ్యర్థన మేరకు యునెస్కో ఆ రోజునే మాతృభాష దినోత్సవంగా జరిపేందుకు సిద్ధమైంది. ఈ ప్రతిపాదనకు భారత్‌, పాక్‌ సహా 28 దేశాలు మద్దతిచ్చా ఆ సంఘటనను పురస్కరించుకుని యునెస్కో ఫిబ్రవరి 21వ తేదీని అంతర్జాతీయ మాతృభాషా దినో త్సవంగా ప్రకటించింది.

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మాతృభాషలు అంతర్థానమయ్యే స్థితిలో వున్నాయి. ఆంగ్లభాష అనే రోడ్డు రోలర్ కిందపడి ఇప్పటికే బక్కచిక్కిన మాతృభాషలెన్నో నలిగి కనుమరుగైపోయాయని.. ఇటీవలి యునెస్కో సర్వే తేల్చింది. ప్రపంచంలో సుమారు ఏడు భాషల్లో, 230 భాషలు అంతరించాయి. ఇంకా 3 వేల భాషలు అంతరించే దశలో ఉన్నాయని యునెస్కో వెల్లడించింది. ఈ భాషల జాబితాలో తెలుగు భాష ఉందని యునెస్కో ప్రకటించింది. ఒక భాషను మాట్లాడే జనాభాలో ముప్ఫై శాతం మంది ఆ భాషను చదవకుండా, తల్లి భాషకు దూరమైతే ఆ భాష కాలక్రమంలో మృతభాషగా మారుతుందని యునెస్కో సూత్రీకరించి, తెలుగుకు ఆ పరిస్థితి రాబోతుందని ప్రకటించింది. ఇది తెలుగు భాషాభిమానులను కలవరపర్చే విషయం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రెండు వారాలకు ఒక భాష కనుమరుగవుతోందట.

భారత్‌లో నలభైకి పైగా భాషలు, మాండలికాలు అదే ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నాయి. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన గదబ, నైకీ అనే గిరిజనతెగల భాషలున్నాయి. పదివేల మంది కంటే తక్కువగా మాట్లాడే భాషలు క్రమంగా కాలగర్భంలో కలిసి పోతాయని పరిశోధకులు చెబుతున్నారు. నీతి, నియమాలు, నడవడిక నేర్పే మాతృ భాషలు అంతరిస్తే.. మానవ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. సైన్స్, కంప్యూటర్, గణితం.. ఇలా ఏ సబ్జెక్టు కూడా మంచి చెడుల గురించి చెప్పవు. మంచి, చెడు విడమరిచి చెప్పేది మాతృభాష ఒక్కటే. మన తెలుగు భాషనే తీసుకుంటే.. మనిషి వికాసానికి కావాల్సిన నీతి నియమాలన్నీ పురాణేతిహాసాల రూపంలో మన మాతృభాషలోనే మిళితమై వున్నాయి. అలాంటి మాతృభాష అంతర్థానమైతే.. మన మనగడే ప్రశ్నార్థకం అవుతుంది.

భాష.. కేవలం భావాలు వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సాధనమే కాదు, ఒక జాతి ఉనికిని, సంస్కృతిని మొత్తంగా జీవన విధానాన్నే పరిచయం చేస్తుంది. సమాజం రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. అయితే.. భాషలు అంతరించిపోతున్నాయి. భాష అంతరించిదంటే.. ఆ భాష మాట్లాడే సమూహం అంతరించినట్లేనని భావించాలి. నిజమైన భావ ప్రేరేపణ, ప్రగతి, మాతృభాష వల్లనే వస్తుందని,.. స్వభాషలో విద్య ఉంటే, స్వరాజ్యం ఎప్పుడో వచ్చేదని’ గాంధీజీ 1938లోనే చెప్పారు. మొదట నేర్చుకునే మాతృభాష ఎంత గట్టిగా నేర్చుకుంటే దాని ద్వారా ఇతర భాషల్ని అంత గట్టిగా నేర్చుకోగలరని.. మెకంజి, వాకర్ లాంటి భాషా శాస్తవ్రేత్తలు చెప్పిన మాట. సాథియాసీలన్, కీసర్ ఎట్ ఆల్ లాంటి పరిశోధకులు కూడా.. ఇతర భాషలకన్నా మాతృభాషలో నేర్చుకోగల సామర్ధ్యం ఎవరికైనా ఎక్కువగా వుంటుందన్నారు. మాతృభాషలోనే ఆలోచించగలరు, కలలు కనగలరు, ఆ పునాదితోనే భవిష్యత్తులో ధైర్యంగా ముందుకు కదలగలరని చెప్పారు. మాతృభాషలో విద్యను బోధిస్తే మానసిక వికాసానికి, సంపూర్ణ మూర్తిమత్వానికి దోహదం చేస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే మాతృభాషను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి పరమావధి కావాలి. ఏ భాషలో విద్యాబోధన జరగదో ఆ భాష 40 సంవత్సరాల్లో నశించి పోతుందని యునెస్కో అధ్యయనం శాస్త్రీయంగా చాటింది.

ఆర్థిక, సాంకేతికాభివృద్ధుల కారణంగా విదేశాల్లో అవకాశాలు పెరుగుతూ, విదేశాల్లోని అవసరాలు మన దగ్గరకు వస్తూ ప్రస్తుతం ప్రపంచమంతా వసుధైక కుటుంబంలా తయారవుతూ, ఒకే భాషా, ఒకే సంస్కృతి అన్నట్టుగా మారుతోంది. ప్రపంచీకరణ వల్ల ప్రపంచం అంతా మనకు దగ్గరవుతోండగా, మన భాష మాత్రం మనకు దూరమవుతోంది. భాషాసంస్కృతులు ఒక దానితో ఒకటి ముడిపడి ఉంటాయి కాబట్టి మారుతోన్న మన సంస్కృతితో బాటుగా మన భాష కూడా మారుతోంది. ఒకప్పుడు భాషలో వచ్చే మార్పులకు కొన్ని తరాలు పడితే, ఈ ఆధునిక యుగంలో ఒక్క తరంలోనే ఎన్నో మార్పులను చూస్తున్నాం.

అమ్మభాష అంటే అందరికీ ఇష్టమే! తెలుగు మాటలూ, పాటలూ కూడా మనకు మక్కువే! మరి ఎందుకని తెలుగు భాష మనుగడ గురించి కలవరపడుతున్నాం..? ఎందుకు ఏళ్ల తరబడి చర్చోపచర్చలు జరుపుతున్నాం..? ఎందుకంటే… తెలుగంటే నవతరానికి చులకన. ఆర్జనకోసమంటూ ఆంగ్లభాషకే తల్లిదండ్రుల మద్దతు. మరోవైపు ప్రభుత్వాల పట్టింపులేనితనం… ఇలా అమ్మభాషకు అడుగడుగునా అగచాట్లు. మాతృ భాషకు అధికారిక హోదా ఇచ్చి, అన్నిటా దానికి చెల్లుచీటి ఇస్తే… భాష బతికేదెలా..? కానీ, ఇప్పుడదే జరుగుతోంది.

Also Read:

 గత కొన్ని రోజులుగా దిగి వస్తున్న పసిడి ధరలు ఈరోజు ఎలా ఉన్నాయంటే..!

స్మార్ట్ ఫోన్‌లో లొకేషన్ ట్రాకింగ్ యాప్‌తో వ్యక్తిగత వివరాలు ఎలా చోరీ అవుతున్నాయో తెలుసా..!

ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు