AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాయదారి కరోనా.. అప్పుడే పుట్టిన బిడ్డను.. వీడియో కాల్ లో చూసుకున్న తల్లి..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచం మొత్తం లాక్ డౌన్‌లో ఉండిపోయింది. కరోనా మహమ్మారి మనుషుల మధ్య పెద్ద గోడలా నిలుస్తోంది. తల్లీబిడ్డలను కూడా దూరం చేస్తోంది. ఇటీవల మహారాష్ట్రలోని

మాయదారి కరోనా.. అప్పుడే పుట్టిన బిడ్డను.. వీడియో కాల్ లో చూసుకున్న తల్లి..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 25, 2020 | 7:12 PM

Share

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచం మొత్తం లాక్ డౌన్‌లో ఉండిపోయింది. కరోనా మహమ్మారి మనుషుల మధ్య పెద్ద గోడలా నిలుస్తోంది. తల్లీబిడ్డలను కూడా దూరం చేస్తోంది. ఇటీవల మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ. కొన్ని రోజుల క్రితం ఓ గర్భవతి.. ఔరంగాబాద్ ప్రభుత్వాస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమెకు కరోనా సోకి ఉండటంతో ఐసోలేషన్ వార్డుకు తరలించారు.

కాగా.. పుట్టిన బిడ్డకు కరోనా సోకలేదు. దీంతో బిడ్డను తల్లి నుంచి వేరు చేసి వేరే వార్డులో ఉంచారు. ఈ నేపథ్యంలో తన బిడ్డను ఒక్కసారి చూడాలని ఆ తల్లి కోరింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది వీడియోకాల్ ద్వారా ఆ తల్లికి బిడ్డను చూపించారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

[svt-event date=”25/04/2020,6:24PM” class=”svt-cd-green” ]

[/svt-event]