AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డ్రైఫ్రూట్స్ ఖర్చు రూ.18 లక్షలా? సీఎం జగన్ షాక్

ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్వహిస్తున్న వరుస సమీక్షల సందర్భంగా పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా విద్యాశాఖలో సమీక్ష చేస్తున్న సమయంలో ఏపీ ఉన్నత విద్యామండలిలో జరిగిన ఓ తంతు బయటపడింది. ఈ శాఖలో పనిచేస్తున్న.. కేవలం నలుగురు అధికారులకు డ్రైఫ్రూట్స్ కోసం గత మూడేళ్లలో 18 లక్షల రూపాయలు ఖర్చుపెట్టినట్లు తేలింది. ఈ విషయాన్ని అధికారులు ఇవాళ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ విషయం తెలిసి సీఎం జగన్ షాక్ […]

డ్రైఫ్రూట్స్ ఖర్చు రూ.18 లక్షలా? సీఎం జగన్ షాక్
Ram Naramaneni
|

Updated on: Jun 03, 2019 | 7:25 PM

Share

ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్వహిస్తున్న వరుస సమీక్షల సందర్భంగా పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా విద్యాశాఖలో సమీక్ష చేస్తున్న సమయంలో ఏపీ ఉన్నత విద్యామండలిలో జరిగిన ఓ తంతు బయటపడింది. ఈ శాఖలో పనిచేస్తున్న.. కేవలం నలుగురు అధికారులకు డ్రైఫ్రూట్స్ కోసం గత మూడేళ్లలో 18 లక్షల రూపాయలు ఖర్చుపెట్టినట్లు తేలింది. ఈ విషయాన్ని అధికారులు ఇవాళ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ విషయం తెలిసి సీఎం జగన్ షాక్ అయ్యారట.

ఇప్పటికే ఆర్ధికశాఖలో జరిగిన  అక్రమ కేటాయింపులపై ఓవైపు చర్చ జరుగుతుండగానే ఏపీ ఉన‌్నత విద్యామండలిలో జరిగిన ఈ పరిణామం తాజా ప్రభుత్వానికి విస్మయం కలిగించింది. అయితే ఈ మొత్తం అధికారిక కార్యక్రమాల సందర్భంగా వాడిన డ్రైఫ్రూట్స్ కు ఖర్చు చేశారా లేక సొంత అవసరాల కోసం వాడుకున్నారా అనేది తేలాల్సి ఉంది. రివ్యూల్లో గుర్తించిన అంశాలతో నివేదికలు రూపొందించాలని సీఎం హోదాలో జగన్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అక్రమాలు జరిగినట్టు తేలితే సీఎం చర్యలకు సిద్దమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.