ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఫోన్‌కే కరోనా ఫలితం..!

ఏపీలో ఇకపై కరోనా టెస్టుల ఫలితాలు సంబంధిత వ్యక్తి ఫోన్ నెంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ రూపంలో అందనున్నాయి. ప్రస్తుతం కరోనా నిర్ధారణ టెస్ట్ రిజల్ట్స్...

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఫోన్‌కే కరోనా ఫలితం..!
Follow us

|

Updated on: Jun 10, 2020 | 2:49 PM

ఏపీలో ఇకపై కరోనా టెస్టుల ఫలితాలు సంబంధిత వ్యక్తి ఫోన్ నెంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ రూపంలో అందనున్నాయి. ప్రస్తుతం కరోనా నిర్ధారణ టెస్ట్ రిజల్ట్స్ వెల్లడించే విధానంలో కొన్ని లోపాలు తలెత్తుతుండటంతో.. ఈ కొత్త విధానాన్ని మంగళవారం నుంచి అమలులోకి తీసుకొచ్చారు. వాస్తవానికి కరోనా పరీక్షల చేయించుకున్న తర్వాత ఫలితాలు వచ్చేందుకు రెండు రోజుల సమయం పడుతుంది.

వాటిని ఆన్లైన్ ద్వారా వైద్యులు, ఆసుపత్రి సూపరిటెండెంట్లకు తెలియజేస్తారు. ఈ క్రమంలోనే కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. వాటిని అధిగమించడం కోసమే కరోనా టెస్ట్ ఫలితాలను నేరుగా చేయించుకున్న వ్యక్తి సెల్‌ఫోన్‌కే మెసేజ్ ద్వారా అందజేయనున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. కాగా, వైద్య ఆరోగ్యశాఖ పంపే లింకు ఆధారంగా కూడా కరోనా ఫలితాన్ని చూసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు.

Also Read: 

జగన్ కీలక నిర్ణయం.. వారందరికీ ఇసుక ఉచితం..

అంతర్రాష్ట్ర సర్వీసులపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..

విజయవాడలో కరోనా టెర్రర్.. కంటైన్మెంట్ జోన్లుగా 42 డివిజన్లు..

జగన్ కీలక నిర్ణయం.. త్వరలోనే వైద్యశాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.!

దసరా వరకు స్కూల్స్ తెరిచే ప్రసక్తి లేదు..!

కిమ్‌శకం ఇక ముగిసినట్లేనా.? ఆ ఇద్దరిలో ఒకరికి పగ్గాలు.!

Latest Articles