AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైతుల ఆందోళనపై మళ్ళీ గళమెత్తిన సోనియా గాంధీ, మరీ ఇంత నిరంకుశమా ? బీజేపీపై ఫైర్

రైతుల ఆందోళనపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మళ్ళీ గళమెత్తారు. 44 రోజులుగా అన్నదాతలు ఆందోళన చేస్తున్నా ఈ బీజేపీ ప్రభుత్వానికి స్పృహ లేదని..

రైతుల ఆందోళనపై మళ్ళీ గళమెత్తిన సోనియా గాంధీ, మరీ ఇంత నిరంకుశమా ? బీజేపీపై ఫైర్
Umakanth Rao
| Edited By: |

Updated on: Jan 07, 2021 | 4:11 PM

Share

Farmers Protest:రైతుల ఆందోళనపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మళ్ళీ గళమెత్తారు. 44 రోజులుగా అన్నదాతలు ఆందోళన చేస్తున్నా ఈ బీజేపీ ప్రభుత్వానికి స్పృహ లేదని, వారి పట్ల నిరంకుశంగా, క్రూరంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పేద, మధ్యతరగతి అన్నదాతల నడ్డి విరుస్తోందని, కరోనాతో ఎకానమీ కుప్ప కూలిన సమయంలో మోడీ ప్రభుత్వం ఖజానా నింపుకుంటోందని ఆమె అన్నారు. ముడి చమురు ధర లీటరుకు రూ. 23.43 మాత్రమే ఉన్నప్పటికీ కేంద్రం డీజిల్ కి రూ. 74.38, పెట్రోలుకు రూ. 84.20 రేట్లతో దోచుకుంటోందని ఆమె దుయ్యబట్టారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తక్కువగా ఉన్నా ఆ ప్రయోజనాలను వినియోగదారులకు చేరనీయడంలేదన్నారు. ఇందుకు ఎక్సయిజు సుంకాన్ని భారీగా పెంచడమే నిదర్శనమన్నారు. 19 లక్షల కోట్లను జనం జేబుల నుంచి వసూలు చేసిందని పేర్కొన్న సోనియా.. వంట గ్యాస్ సిలిండర్ ధరలను కూడా పెంచారని విమర్శించారు.

యూపీఏ హయాంలో ఉన్న ఎక్సయిజు పన్ను రేట్లనే ఇప్పుడు కూడా కొనసాగించాలని ఆమె డిమాండ్ చేశారు. రైతుల వివాదాస్పద చట్టాలను తక్షణమే రద్దు చేయాలని ఆమె మళ్ళీ కోరారు.

Also Read:

కృష్ణమ్మ ఒడ్డున, సీతమ్మ పాదాల చెంత: ఆలయాల నిర్మాణానికి రేపు భూమిపూజ, ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులకు శ్రీకారం

ఢిల్లీ సరిహద్దులో భారీగా ట్రాక్టర్ ర్యాలీ, ఇది రిహార్సల్స్ మాత్రమే, 26 న మా తడాఖా చూపుతాం, రైతు సంఘాలు

Germany Extends Lockdown: మళ్లీ లాక్ డౌన్ పొడిగించిన జర్మన్… అక్కడ తాజా పరిస్థితికి అడ్డం పడుతుందా..?