AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైఎస్ జగన్ కీలక నిర్ణయం.. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారికి ఊరట..!

సీపీఎస్‌, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై సమగ్రమైన రిపోర్టు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు‌. కాంట్రిబ్యూటరీ పింఛన్‌ పథకం..

వైఎస్ జగన్ కీలక నిర్ణయం.. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారికి ఊరట..!
Ravi Kiran
|

Updated on: Nov 12, 2020 | 9:46 PM

Share

APSRTC Employees: సీపీఎస్‌, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై సమగ్రమైన రిపోర్టు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు‌. కాంట్రిబ్యూటరీ పింఛన్‌ పథకం- CPS, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమస్యలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. సీపీఎస్‌కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారులు సమావేశంలో వివరించారు. సీపీఎస్‌పై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం, సీఎస్‌ నేతృత్వంలో వివిధ శాఖల కార్యదర్శుల కమిటీలు, అంతకు ముందు ఇచ్చిన టక్కర్‌ కమిటీ నివేదికను కూడా పరిశీలించారని అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ఉద్యోగులు, యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో లక్షా 98వేల 221 మంది సీపీఎస్‌లో ఉన్నారని, నేరుగా ప్రభుత్వ ఉద్యోగులు లక్షా 78వేల 705 కాగా, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద 3,295 మంది ఉండగా మిగిలిన 16,221 మంది యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో పని చేస్తున్నారని చెప్పారు. వారికి ఏ పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తే ఎంత వ్యయం అవుతుందన్న వివరాలను అధికారులు ప్రస్తావించారు.

వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్న జగన్, ప్రభుత్వంలో విలీనం చేసిన ఆర్టీసీకి చెందిన దాదాపు 52 వేల మంది ఉద్యోగులను కూడా ఆ జాబితాలో చేర్చి, సమగ్ర నివేదిక సిద్దం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు ఉద్యోగుల ప్రస్తావన కూడా వచ్చింది. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించిన విషయం న్యాయపరమైన అంశాలతో ముడి పడి ఉన్నందున, ఇబ్బందులు తలెత్తకుండా వారికి ఆర్థికంగా ప్రయోజనాలు చేకూర్చేందుకు తగిన విధి విధానాలు రూపొందించాలని సీఎం ఆదేశించారు.