గ్రాండ్‌గా చైనా నేషనల్‌ డే… భారీ పరేడ్‌తో అమెరికాకు డ్రాగన్‌ హెచ్చరిక!

డ్రాగన్‌ కంట్రీ తన సైనిక సత్తాను ప్రపంచానికి చాటింది. గ్రాండ్‌గా మిలటరీ పరేడ్‌ నిర్వహించింది. నేషనల్‌ డే సందర్భంగా జరిగిన ఈవెంట్‌ కలర్‌ఫుల్‌గా సాగింది. దేశ ఆర్థిక ప్రగతి ఉట్టిపడేలా ప్రదర్శన జరిగింది. చైనా మాజీ అధ్యక్షులు కూడా నేషనల్‌ డే ఈవెంట్‌లో పాల్గొన్నారు. చైనాలో కమ్యూనిస్ట్‌ ప్రభుత్వం ఏర్పడి 70 ఏళ్లు అవుతోంది. ఈ 70 ఏళ్లలో డ్రాగన్‌ కంట్రీ అసాధారణ అభివృద్ధి సాధించింది. ఈ సందర్భంగా తమ ఆర్ధిక అభివృద్ధి, సైనిక సత్తాను ప్రపంచ […]

గ్రాండ్‌గా చైనా నేషనల్‌ డే... భారీ పరేడ్‌తో అమెరికాకు డ్రాగన్‌ హెచ్చరిక!
Follow us

| Edited By:

Updated on: Oct 01, 2019 | 11:53 PM

డ్రాగన్‌ కంట్రీ తన సైనిక సత్తాను ప్రపంచానికి చాటింది. గ్రాండ్‌గా మిలటరీ పరేడ్‌ నిర్వహించింది. నేషనల్‌ డే సందర్భంగా జరిగిన ఈవెంట్‌ కలర్‌ఫుల్‌గా సాగింది. దేశ ఆర్థిక ప్రగతి ఉట్టిపడేలా ప్రదర్శన జరిగింది. చైనా మాజీ అధ్యక్షులు కూడా నేషనల్‌ డే ఈవెంట్‌లో పాల్గొన్నారు.

చైనాలో కమ్యూనిస్ట్‌ ప్రభుత్వం ఏర్పడి 70 ఏళ్లు అవుతోంది. ఈ 70 ఏళ్లలో డ్రాగన్‌ కంట్రీ అసాధారణ అభివృద్ధి సాధించింది. ఈ సందర్భంగా తమ ఆర్ధిక అభివృద్ధి, సైనిక సత్తాను ప్రపంచ దేశాలకు చాటి చెప్పేలా జిన్‌పింగ్‌ ప్రభుత్వం మిలటరీ పరేడ్‌ నిర్వహించింది. ఈ పరేడ్‌తో రాజధాని బీజింగ్‌ మార్మోగిపోయింది. సుమారు 15వేల మంది సైనికులతో జరిగిన పరేడ్‌ అందరిని ఆకట్టుకుంది. ఈ ఈవెంట్‌లో కొత్తగా సమకూర్చుకున్న ఆయుధాలను కూడా ప్రదర్శించింది చైనా. ఈ పరేడ్‌కు మాజీ అధ్యక్షులు హూ జింటావో, జియాంగ్‌ జెమిన్‌లు కూడా హాజరయ్యారు. తైమ‌న్‌స్క్వేర్‌లో సైనికులు జాతీయ జెండాను ఆవిష్క‌రించారు.

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మిలటరీ గౌరవ వందన స్వీకరించారు. ప్రతీ ఏడాది అక్టోబర్‌ 1వ తేదీన చైనా జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. 1949లో పీపుల్స్ రిప‌బ్లిక్ ఆఫ్ చైనా ఏర్పాటు అయ్యింది. ఇప్పటికి చైనాలో కమ్యూనిస్ట్‌ ప్రభుత్వం ఏర్పడి 70 ఏళ్ల పూర్తి కావడంతో ఈవెంట్‌ను మరింత గ్రాండ్‌గా నిర్వహించింది. సైనిక పరేడ్‌ తిలకించేందుకు వేలాదిగా జనం తరలివచ్చారు. దీంతో తైమ‌న్‌స్క్వేర్‌ కిక్కిరిసిపోయింది. రెడ్‌ కార్పెట్‌పై వందలాది మంది సైనికులు చేసిన పరేడ్‌ అందరిని ఆకట్టుకుంది. దీంతో పాటు సైనిక విన్యాసాలు కూడా చూపరులను కట్టిపడేశాయి. వినువీధుల్లో చైనా ఎయిర్‌ఫోర్స్‌ చేసిన విన్యాసాలు కూడా అందరిని ఆశ్చర్యపరిచాయి.

కమ్యూనిస్ట్‌ ప్రభుత్వం ఏర్పడి 70 ఏళ్లు అయింది. ఆ సందర్భాన్ని కచ్చితంగా సెలబ్రేట్‌ చేసుకోవాలి. కానీ చైనా భారీ పరేడ్‌ వెనుక ఇదొక్కటే రీజన్‌ కాదు… అసలు విషయం మరొకటి ఉంది. ప్రపంచానికి తన సైనిక సత్తా ఏంటో చూపించడం. ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలకు ఇదీ తమ సత్తా అని చెప్పడం ! ఇంతకీ డ్రాగన్‌ కంట్రీ సైనిక సత్తా ఎంత ? కొత్తగా చైనా ఆర్మీ చేతికొచ్చిన ఆయుధాలేంటి ?

ప్రపంచ దేశాలు నోరెళ్ల బెట్టే స్థాయిలో చైనా పరేడ్‌ నిర్వహించింది. బీజింగ్‌ మార్మోగిపోయే రేంజ్‌లో సైనిక పరేడ్‌ జరిగింది. పనిలో పనిగా తమ సైనిక సత్తాను కూడా ప్రపంచానికి చూపించింది డ్రాగన్‌ కంట్రీ. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ ప్రపంచంలోనే పెద్దది. ఈ పరేడ్‌లో 160 యుద్ధ విమానాలతో పాటు దాదాపుగా 580 రకాల ఆయుధాలను చైనా ప్రదర్శించింది. ఈ పరేడ్‌తో ప్రపంచ దేశాలకు చైనా సత్తా ఏంటో తెలిసింది.

గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చైనా యుద్ధ సామర్ధ్యం బాగా పెరిగింది. సబ్‌ మెరైన్లు మొదలుకొని యుద్ధ విమానాల వరకు డ్రాగన్‌ కంట్రీ వద్ద లేని ఆయుధమంటూ లేదు. డ్రాగన్‌ కంట్రీ వద్ద ఉన్న కీలక బాలిస్టిక్‌ క్షిపణుల్లో డీఎఫ్‌ 17 ఒకటి. దీన్ని డాంగ్‌ ఫెంగ్‌ 17 హైపర్‌ సానిక్‌ డాలిస్టిక్‌ క్షిపణిగా పిలుస్తారు. 2017లో దీన్ని చైనా తొలిసారి పరీక్షించింది. అత్యంత వేగంగా కదులుతూ ప్రత్యర్ధి రక్షణ వ్యవస్థను ఇది తప్పుదోవ పట్టించగలదు. ఈ మిసైళ్లు చాలా తక్కువ ఎత్తులో గంటకు 6,115 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయి. దీంతో సులభంగా శత్రు దేశాల రాడార్​ కంట పడకుండా అది తప్పించుకోగలుగుతుంది. లక్ష్యాలను మార్చుకునే సామర్థ్యం దీనికి గలదు. అంతేకాదు అణ్వాయుధాలను సైతం ఇది మోసుకెళ్లగలదు.

చైనా ఆయుధ సంపత్తిలో హెచ్‌ఈ6ఎన్‌ బాంబర్‌ యుద్ధ విమానం చాలా కీలకం. చైనా ఎయిర్‌ఫోర్స్‌కు ఇది ప్రధాన బలం. డీఎఫ్‌ఈ21 నౌకా విధ్వంసక క్షిపణులను ఇది మోసుకెళ్లగలదు. అంతేకాదు గాల్లోనే ఇంధనం నింపుకునే టెక్నాలజీ ఇందులో ఉంది. హెచ్​–6కేకి ఇది అడ్వాన్స్​డ్​ మోడల్​. ఈ యుద్ధ విమానాన్ని కూడా పరేడ్‌లో ప్రదర్శించారు.

సుదూర ప్రాంతాలకు ప్రయాణించి బాంబిగ్‌ చేయగల హెచ్‌ 6 కొత్త వెర్షన్‌ కూడా చైనా దగ్గర ఉంది. దీనికి యాంటీ షిప్‌ క్షిపణులను అమర్చినట్లు ప్రచారం కూడా జరిగింది. గతంలో దీనికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్‌లో పెట్టిన చైనా…. ఎందుకో కానీ వెంటనే వాటిని తొలగించింది. చైనా వద్ద యుద్ధ ట్యాంకర్లు లెక్కలేనన్ని ఉన్నాయి. ఇందులో టైప్‌ 15, టైప్‌ 99 కీలకం. వీటితో రిహార్సల్స్‌ కూడా చేసింది చైనా ఆర్మీ. టైప్‌ 15 యుద్ధ ట్యాంకులు చాలా తేలికగా ఉంటాయి.

చైనా నేవీ సత్తా కూడా బలంగానే ఉంది. ప్రస్తుతం డ్రాగన్‌ కంట్రీకి చెందిన 4 సబ్​మెరైన్లు సముద్ర జలాల్లో తిరుగుతున్నాయి. ఒక్కో సబ్​మెరీన్​లో 12 జేఎల్​ 2 మిసైళ్లు ఉంటాయి. ఈ మిసైళ్లు సుమారు 7,200 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ఛేదించగలవు. దీనికంటే మరింత శక్తివంతమైన జేఎల్‌ 3 క్షిపణిని కూడా గతేడాది చైనా పరీక్షించింది. అయితే దీనిపై అధికార ప్రకటన మాత్రం చేయలేదు. మొత్తంగా చైనా తన యుద్ధ సామర్ధ్యం ఏ స్థాయిలో ఉందో… ఈ మిలిటరీ పరేడ్‌ ద్వారా ప్రపంచ దేశాలకు చూపించింది.

చైనా భారీ పరేడ్‌ లక్ష్యం… డైరెక్ట్‌గా అమెరికాకు స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇవ్వడమే !‌ చైనాతో సై అంటే సై అనే అగ్రరాజ్యానికి తన సత్తా ఏంటో చూపించింది డ్రాగన్‌ కంట్రీ. నేషనల్‌ డే సందర్భంగా చైనా ప్రదర్శించిన ఆయుధ సంపత్తి ఓ విధంగా అమెరికాకు కూడా షాకిచ్చింది. అగ్రరాజ్యం వద్ద లేని ఆయుధాలను చైనా ప్రదర్శించింది. ప్రపంచ దేశాలపై ఆధిపత్యం కోసం పోటీ పడే దేశాల్లో అమెరికా, చైనా ఒకటి. ఆ మాటకొస్తే ఈ రెండు దేశాలు ఆ లిస్టులో ముందు వరుసలో నిలుస్తున్నాయి. వర్తక, వాణిజ్యాలు మొదలుకొని చిన్న పెద్ద దేశాలపై పెత్తనం చెలాయించాలని చూసే దేశాలు ఈ రెండు. అందుకే ఈ రెంటికి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుంది. ఇప్పుడు అమెరికాపై చైనా తన ఆధిపత్యం చూపించుకునే ప్రయత్నం చేసింది. నేషనల్‌ డే సందర్భంగా తమ యుద్ధ సామర్ధ్యాన్ని అమెరికాకు చూపించింది.

చైనా తమ నేషనల్‌ డేలో అత్యంత ఆధునిక ఆయుధాలను ప్రదర్శించింది. అరగంటలో అమెరికాను ఢీకొట్టి బాలిస్టిక్‌ మిస్సైల్స్‌ను కూడా తెరపైకి తెచ్చింది. డీఎఫ్​ 41 మిసైల్..పరేడ్​ మొత్తంలో ఈ క్షిపణి అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే భూమ్మీదే అత్యంత పవర్​ఫుల్​ మిస్సైల్‌ ఇదే ! ఎందుకంటే ఖండాల అవతల ఉన్న లక్ష్యాలను ఇది ఛేదించగలదు. అందుకే దీన్ని ఖండాతర క్షిపణిగా పిలుస్తారు. దీని రేంజ్‌ ఏకంగా 15వేల కిలోమీటర్లు. పీఎల్​ఏ రాకెట్​ ఫోర్సెస్​కు ఇదే ప్రధాన అస్త్రం.

ఆయుధాల పరంగా టాప్​లో ఉండే అమెరికా వద్ద కూడా డీఎఫ్​ 41 స్థాయి మిస్సైల్స్‌ లేవు. చైనా నుంచి దీన్ని ప్రయోగిస్తే అమెరికాను జస్ట్​ 30 నిమిషాల్లో చేరిపోతుంది. ఒకేసారి 10 వార్‌హెడ్లను తీసుకెళ్లే సామర్థ్యం దీని సొంతం. మొన్నామధ్య మంగోలియాలోని ఓ సైట్​లో చైనా దీన్ని పరీక్షించింది. శబ్దవేగం కంటే దాదాపుగా 25 రెట్ల వేగంతో ఇది దూసుకెళ్లగలదు. ఇప్పటికే చైనా వద్ద 11,200 కిలోమీటర్లు ప్రయాణించే డాంగ్‌ఫెంగ్‌ క్షిపణి ఉంది. 1997 నుంచి దీన్ని అభివృద్ధి చేస్తూ వచ్చింది చైనా. 2015, 2017 మిలటరీ పరేడ్లలోనే దీన్ని ప్రదర్శిస్తారని అంతా భావించారు. కానీ డ్రాగన్‌ కంట్రీ దీన్ని రహస్యంగానే ఉంచింది. ఇప్పుడు దక్షిణ చైనా సముద్రంలో జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో చైనా ఈ ఆయుధాన్ని ప్రదర్శించడం విశేషం.

92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ