AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దద్దరిల్లిన దంతెవాడ.. ఇద్దరు మావోలు హతం

దండకారణ్యం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఛత్తీస్‌గడ్‌లోని దంతెవాడ జిల్లాలో.. మంగళవారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భీకరపోరు జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. కాటేకల్యాన్‌ అటవీ ప్రాంతంలో.. డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌(డీఆర్‌జీ) బలగాలు కూంబింగ్‌ చేపడుతున్న సమయంలో.. మావోయిస్టులు డీఆర్‌జీ బలగాలపై కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన బలగాలు.. మావోయిస్టులపై ఎదురుకాల్పులకు దిగారు. దీంతో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. వారి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనాస్థలంలో మిగతా మావోయిస్టులకోసం.. కూంబింగ్ కొనసాగుతోంది.

దద్దరిల్లిన దంతెవాడ.. ఇద్దరు మావోలు హతం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 05, 2019 | 6:45 PM

Share

దండకారణ్యం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఛత్తీస్‌గడ్‌లోని దంతెవాడ జిల్లాలో.. మంగళవారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భీకరపోరు జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. కాటేకల్యాన్‌ అటవీ ప్రాంతంలో.. డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌(డీఆర్‌జీ) బలగాలు కూంబింగ్‌ చేపడుతున్న సమయంలో.. మావోయిస్టులు డీఆర్‌జీ బలగాలపై కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన బలగాలు.. మావోయిస్టులపై ఎదురుకాల్పులకు దిగారు. దీంతో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. వారి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనాస్థలంలో మిగతా మావోయిస్టులకోసం.. కూంబింగ్ కొనసాగుతోంది.