AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రజాధనాన్ని కాల్వలో వేయకండి : కన్నా

ఏపీ రాజకీయాల్లో తీవ్ర వివాదాస్పదంగా మారిన ప్రజావేదిక కూల్చివేతపై బీజేపీ స్పందించింది. కోట్లాది రూపాయల ప్రజా ధనంతో నిర్మించిన ఈ నిర్మాణాన్ని కక్షపూరితంగా కూలగొట్టే ఆలోచన ఉంటే విరమించుకోవాలని వైసీపీకి సూచించారు ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. గత ప్రభుత్వం ఈ నిర్మాణాన్ని అక్రమంగా నిర్మించి ఉంటే ఆవిధంగా చర్యలు తీసుకోవాలి తప్ప కూల్చివేయొద్దన్నారు. అలాగే దీన్ని ప్రజావసరాలకు ఉపయోగించవచ్చని కూడా సూచించారు. ప్రభుత్వం ఒక విధానపరంగా వెళితే తాము ఎలాంటి అభ్యంతరం చెప్పబోమని.. రూ.8 […]

ప్రజాధనాన్ని కాల్వలో వేయకండి :  కన్నా
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 25, 2019 | 9:33 PM

Share

ఏపీ రాజకీయాల్లో తీవ్ర వివాదాస్పదంగా మారిన ప్రజావేదిక కూల్చివేతపై బీజేపీ స్పందించింది. కోట్లాది రూపాయల ప్రజా ధనంతో నిర్మించిన ఈ నిర్మాణాన్ని కక్షపూరితంగా కూలగొట్టే ఆలోచన ఉంటే విరమించుకోవాలని వైసీపీకి సూచించారు ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. గత ప్రభుత్వం ఈ నిర్మాణాన్ని అక్రమంగా నిర్మించి ఉంటే ఆవిధంగా చర్యలు తీసుకోవాలి తప్ప కూల్చివేయొద్దన్నారు. అలాగే దీన్ని ప్రజావసరాలకు ఉపయోగించవచ్చని కూడా సూచించారు.

ప్రభుత్వం ఒక విధానపరంగా వెళితే తాము ఎలాంటి అభ్యంతరం చెప్పబోమని.. రూ.8 కోట్ల ప్రజాధనంతో గత ప్రభుత్వం దీన్ని నిర్మిస్తే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అదే ప్రజాధనాన్ని కాల్వలో వేయడం కంటే ప్రజా అవసరాలకు ఉపయోగించాలని తెలిపారు.