తండ్రిని సైకిల్ పై కూర్చుపెట్టుకోని 1200 కిమీ ప్రయాణం…బాలికపై ఇవాంకా ప్రశంసలు..
ప్రస్తుతం కరోనా కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో వలస కార్మికుల ఎదుర్కొంటున్న కష్టాలు మాటల్లో వర్ణించలేం. ఎందరో సొంత ఊర్లకు చేరుకోవాలని కాలినడకన, సైకిళ్లపై పయనమవుతున్నారు. ఇటీవల 15 సంవత్సరాల బాలిక జ్యోతి కుమారి .. అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని సైకిల్ మీద కూర్చో బెట్టుకుని 1200 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కి..తండ్రిపై తన ప్రేమ ఏపాటిదో నిరూపించుకుంది. ఆ బాలిక యొక్క పట్టుదలను చూసి..సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రశంసించింది. […]
ప్రస్తుతం కరోనా కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో వలస కార్మికుల ఎదుర్కొంటున్న కష్టాలు మాటల్లో వర్ణించలేం. ఎందరో సొంత ఊర్లకు చేరుకోవాలని కాలినడకన, సైకిళ్లపై పయనమవుతున్నారు. ఇటీవల 15 సంవత్సరాల బాలిక జ్యోతి కుమారి .. అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని సైకిల్ మీద కూర్చో బెట్టుకుని 1200 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కి..తండ్రిపై తన ప్రేమ ఏపాటిదో నిరూపించుకుంది. ఆ బాలిక యొక్క పట్టుదలను చూసి..సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రశంసించింది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ సైతం జ్యోతిని ప్రశంసించారు. ఆమె అసమాన ప్రతిభను మెచ్చుకున్నారు. ‘గాయంతో ఉన్న తండ్రిని సైకిల్ మీద ఎక్కించుకుని 7 రోజుల పాటు తొక్కుతూ 1200 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సొంత ఊరికి చేరుకుంది. ఆమె అందమైన సహనం, ప్రేమ… భారతీయ సొసైటీనే కాకుండా సైక్లింగ్ ఫెడరేషన్ను కూడా ఆకట్టుకుంది.’ అంటూ ఇవాంకా ట్రంప్ ట్వీట్ లో పేర్కొన్నారు.
15 yr old Jyoti Kumari, carried her wounded father to their home village on the back of her bicycle covering +1,200 km over 7 days.
This beautiful feat of endurance & love has captured the imagination of the Indian people and the cycling federation!?? https://t.co/uOgXkHzBPz
— Ivanka Trump (@IvankaTrump) May 22, 2020
బీహార్ కు చెందిన జ్యోతికుమారి తండ్రితో కలసి గురుగ్రామ్లో నివశిస్తోంది. ఆమె ప్రస్తుతం 8వ తరగతి చదువుతోంది. కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో ఆమె తండ్రి ఉపాధి కొల్పోయాడు. దీంతో సొంత ఊరికి వెళ్లి కొంతకాలం గడుపుదామని అనుకున్నారు. జ్యోతి తండ్రి అనారోగ్యంతో ఉండటంతో..అతడికి సైకిల్ తొక్కే పరిస్థితి లేదు. ఇక చేసేది లేక తానే ఆ పనికి పూనుకుంది. తండ్రిని వెనుక సైకిల్ పై కూర్చోబెట్టుకుని 1200 కిలోమీటర్ల దూరాన్ని ఏడు రోజుల్లో చేరుకుంది. అంత దూరం ఓ బాలిక సైకిల్ తొక్కడం అంటే మాములు విషయం కాదు. విషయం సోషల్ మీడియా ద్వారా బయటకు తెలియడంతో.. సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆమె ప్రతిభను ప్రశంసించింది. జ్యోతి కుమారిని సైక్లింగ్ ట్రయల్స్కు రావాల్సిందిగా కోరింది. ఆమె ట్రయల్స్లో సెలక్ట్ అయితే, ట్రైనీగా ఛాన్స్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో ట్రైనింగ్ ఉంటుంది.