AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ న్యూస్ బిగ్ డిబేట్: రాజధాని పందాలు

ఏపీ రాజధాని అమరావతి పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా తుళ్లూరులో హై టెన్షన్ నెలకొంది. తుళ్లూరు నుంచి విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయానికి పాదయాత్రగా బయల్దేరిన మహిళలను.. ఆ గ్రామ శివారులో పోలీసులు అడ్డుకున్నారు. అయితే మేమంతా అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్తున్నామని.. ప్రభుత్వంపై కోట్లాడేందుకు కాదని.. తమను వదిలేయాలంటూ పోలీసులను వేడుకున్నారు. అయితే పాదయాత్రలకు, ర్యాలీలకు ఎలాంటి అనుమతి లేదని.. మీరు చేపట్టిన ఈ పాదయాత్రను విరమించుకోవాలని మహిళలకు పోలీసులు చెప్పారు. దీంతో ఇరు వర్గాల మధ్య […]

బిగ్ న్యూస్ బిగ్ డిబేట్: రాజధాని పందాలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 10, 2020 | 10:47 PM

Share

ఏపీ రాజధాని అమరావతి పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా తుళ్లూరులో హై టెన్షన్ నెలకొంది. తుళ్లూరు నుంచి విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయానికి పాదయాత్రగా బయల్దేరిన మహిళలను.. ఆ గ్రామ శివారులో పోలీసులు అడ్డుకున్నారు. అయితే మేమంతా అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్తున్నామని.. ప్రభుత్వంపై కోట్లాడేందుకు కాదని.. తమను వదిలేయాలంటూ పోలీసులను వేడుకున్నారు. అయితే పాదయాత్రలకు, ర్యాలీలకు ఎలాంటి అనుమతి లేదని.. మీరు చేపట్టిన ఈ పాదయాత్రను విరమించుకోవాలని మహిళలకు పోలీసులు చెప్పారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకున్నా.. వారిని కాదని ముందుకు వెళ్లారు కొందరు రైతులు, మహిళలు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఈ క్రమంలో పలువురు మహిళలు, రైతులకు స్వల్ప గాయాలయ్యాయి. శుక్రవారం అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లాలంటే.. ప్రభుత్వం అనుమతి కావాలా అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మూడు రాజధానుల ప్రతిపాదనపై సమాలోచనలు జరుపుతున్న ఏపీ హై పవర్ కమిటీ అమరావతి ఏరియా రైతులకు తగిన న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. శుక్రవారం రెండో దఫా జరిగిన హైపవర్ కమిటీ సమావేశంలో పలు కీలకాంశాలపై చర్చ జరిగినట్లు కమిటీ సభ్యుడు, ఏపీ రవాణా శాఖా మంత్రి పేర్ని నాని చెప్పారు. కమిటీ జనవరి 13న మరోసారి సమావేశం అవుతుందని ఆయన వెల్లడించారు.

విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు అసలు ఉద్యమమంటే ఏంటో చూపిస్తానంటున్నారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఉత్తరాంధ్ర వాసుల కలలు నెరవేరే సమయంలో మోకాలడ్డుతున్న చంద్రబాబుకు ఉత్తరాంధ్ర దెబ్బ రుచి చూపిస్తామంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు స్పీకర్. ఉత్తరాంధ్ర ఫోరం అధ్వర్యంలో జరిగిన సమావేశం తర్వాత తమ్మినేని సీతారాం శుక్రవారం మీడియాతో మాట్లాడారు.